Begin typing your search above and press return to search.
ధోని.. అదొక్కటి చేయి ప్లీజ్ అంటున్న ఫ్యాన్స్
By: Tupaki Desk | 12 April 2023 10:30 AM GMTఐపీఎల్ లో టాప్ జట్లు అయిన ముంబై, చెన్నైలు ఇప్పటివరకూ అంతగా సత్తా చాటలేదు. తొలి మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడిన చెన్నై ఇటీవల మళ్లీ పుంజుకొని గెలుపు బాటపట్టింది. ఇక నిన్న ఢిల్లీపై ముంబై లాస్ట్ బాల్ కు అతి కష్టం మీద గెలిచి ఊపిరి పీల్చుకుంది.
ఈ రోజు బలమైన రాజస్థాన్ రాయల్స్ ను చెన్నై ఎదుర్కోబోతోంది. చెన్నై చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కాబోతోంది. ఇప్పటివరకూ రెండు జట్లు కూడా రెండేసి విజయాలతో సమఉజ్జీగా ఉన్నాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్తానంలో నిలిచింది.
చెన్నై వరుస ఓటములతో అంతగా రాణించని మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ ను దూరం పెట్టింది. వారి స్థానంలో అజింక్య రహానేను తీసుకుంది. రహానే సునామీలా విరుచుకుపడి హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. దీంతో ఈరోజు మ్యాచ్ లోనూ రహానే ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఈరోజు మ్యాచ్ కు మొయిన్ అలీ అందుబాటులోకి రానున్నట్టు తెలిసింది. ఆల్ రౌండర్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకుంటే బౌలర్లలో ఒకరిని తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఉంటాయి. ప్రిటోరియస్ లేదా మలాగాల్లో ఒకరిపై వేటు పడొచ్చు.
ఇక అందరూ ఎదురుచూసేది ఒక్కటే మిగిలింది. చెన్నై ఫ్యాన్స్ కూడా చిదంబరం స్టేడియంలో ధోని నుంచి ఓ బిగ్ ఇన్నింగ్స్ ను ఆశిస్తున్నారు. గడిచిన మూడు మ్యాచ్ లలోనూ ధోని ఆడింది చాలా తక్కువ బంతులే. ఇన్నింగ్స్ చివర్లో అందరికంటే లాస్ట్ లో ధోని బ్యాటింగ్ కువ స్తున్నాడు. మూడు మ్యాచుల్లోనూ కొన్నే బంతులు ఎదుర్కొని 260 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు.
ధోని ఈరోజు ముందుగా బ్యాటింగ్ ఆర్డర్ లో రావాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోరుతున్నారు. చెన్నై స్టేడియాన్ని ఊపు ఊపాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. దూకుడుతో ఓ ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్నింగ్స్ ను ఇవ్వాలంటూ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టారు. మరి ఈరోజు రాత్రి జరగబోయే రాజస్థాన్ తో మ్యాచ్ లో ఫ్యాన్స్ కోరినను ధోని మన్నిస్తాడా? లేదా? అన్నది చూడాలి.
ఈ రోజు బలమైన రాజస్థాన్ రాయల్స్ ను చెన్నై ఎదుర్కోబోతోంది. చెన్నై చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కాబోతోంది. ఇప్పటివరకూ రెండు జట్లు కూడా రెండేసి విజయాలతో సమఉజ్జీగా ఉన్నాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్తానంలో నిలిచింది.
చెన్నై వరుస ఓటములతో అంతగా రాణించని మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ ను దూరం పెట్టింది. వారి స్థానంలో అజింక్య రహానేను తీసుకుంది. రహానే సునామీలా విరుచుకుపడి హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. దీంతో ఈరోజు మ్యాచ్ లోనూ రహానే ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఈరోజు మ్యాచ్ కు మొయిన్ అలీ అందుబాటులోకి రానున్నట్టు తెలిసింది. ఆల్ రౌండర్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకుంటే బౌలర్లలో ఒకరిని తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఉంటాయి. ప్రిటోరియస్ లేదా మలాగాల్లో ఒకరిపై వేటు పడొచ్చు.
ఇక అందరూ ఎదురుచూసేది ఒక్కటే మిగిలింది. చెన్నై ఫ్యాన్స్ కూడా చిదంబరం స్టేడియంలో ధోని నుంచి ఓ బిగ్ ఇన్నింగ్స్ ను ఆశిస్తున్నారు. గడిచిన మూడు మ్యాచ్ లలోనూ ధోని ఆడింది చాలా తక్కువ బంతులే. ఇన్నింగ్స్ చివర్లో అందరికంటే లాస్ట్ లో ధోని బ్యాటింగ్ కువ స్తున్నాడు. మూడు మ్యాచుల్లోనూ కొన్నే బంతులు ఎదుర్కొని 260 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు.
ధోని ఈరోజు ముందుగా బ్యాటింగ్ ఆర్డర్ లో రావాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోరుతున్నారు. చెన్నై స్టేడియాన్ని ఊపు ఊపాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. దూకుడుతో ఓ ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్నింగ్స్ ను ఇవ్వాలంటూ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టారు. మరి ఈరోజు రాత్రి జరగబోయే రాజస్థాన్ తో మ్యాచ్ లో ఫ్యాన్స్ కోరినను ధోని మన్నిస్తాడా? లేదా? అన్నది చూడాలి.