Begin typing your search above and press return to search.
రఘువీరాను రైతులు కొట్టారు
By: Tupaki Desk | 13 Sep 2015 8:21 AM GMTరాజకీయాల్లో తరచూ ఓ డైలాగ్ వినిపిస్తుంది... ఎవరు ఎవరిపై విమర్శలు చేసినా - ఆరోపణలు చేసినా - బురద జల్లుతున్నారని అంటుంటారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి తాజాగా ఆ బురద జల్లడం అనేది వాస్తవ అర్థంలోనే అనుభవమైంది. అవును... రఘువీరాను మట్టి - బురదతో కొట్టారు. బందరు పోర్టు కోసం ప్రభుత్వం సేకరించనున్న భూముల పరిశీలనకు వెళ్లిన ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. రఘువీరాపై కృష్ణా జిల్లా కోన గ్రామస్థులు మట్టితో దాడి చేశారు.
బందరు పోర్టు కోసం భూములిచ్చేది లేదని ఇప్పటికే గ్రామస్థులు తేల్చిచెప్పారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ - మంత్రి కొల్లు రవీంద్ర ఎంతమేర నచ్చజెప్పినా రైతుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితిని సమీక్షించడంతో పాటు భూముల పరిశీలనకు రఘువీరా ఉదయం కోన గ్రామానికి వెళ్లారు. తమ గ్రామంలో రాజకీయ నేతను చూసిన కోన గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. తమ గ్రామంలోకి ఏ ఒక్క రాజకీయ నాయకుడి ప్రవేశానికి వీలు లేదని చెప్పిన గ్రామస్థులు రఘువీరాపై మట్టితో దాడి చేశారు. పాపం... వాళ్లతో మాట్లాడాలని వెళ్లిన ఆయన వెనుదిరగాల్సివచ్చింది.
బందరు పోర్టు కోసం భూములిచ్చేది లేదని ఇప్పటికే గ్రామస్థులు తేల్చిచెప్పారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ - మంత్రి కొల్లు రవీంద్ర ఎంతమేర నచ్చజెప్పినా రైతుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితిని సమీక్షించడంతో పాటు భూముల పరిశీలనకు రఘువీరా ఉదయం కోన గ్రామానికి వెళ్లారు. తమ గ్రామంలో రాజకీయ నేతను చూసిన కోన గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. తమ గ్రామంలోకి ఏ ఒక్క రాజకీయ నాయకుడి ప్రవేశానికి వీలు లేదని చెప్పిన గ్రామస్థులు రఘువీరాపై మట్టితో దాడి చేశారు. పాపం... వాళ్లతో మాట్లాడాలని వెళ్లిన ఆయన వెనుదిరగాల్సివచ్చింది.