Begin typing your search above and press return to search.
ఆందోళన చేసే రైతుల చేతులకు సంకెళ్లా? ఇదేంది కేసీఆర్?
By: Tupaki Desk | 14 Jun 2023 10:15 AM GMTరైతు రాజ్యం అంటూ గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు లో.. అదే రైతుల కు జరుగుతున్న అవమానాల కు నిలువెత్తు సాక్ష్యంగా మారింది తాజా ఉదంతం. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చాలని ఆందోళన చేసిన రైతుల చేతికి యాదాద్రి భువనగిరి పోలీసులు సంకెళ్లు వేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
ఈ తీరు పై రాజకీయ పార్టీలు.. ప్రజా సంఘాలు తీవ్రస్థాయి లో మండిపడ్డాయి. పోలీసుల తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఉన్న రైతుల ను మంగళవారం భువనగిరి కోర్టు లో హాజరుపర్చేందుకు తీసుకు వచ్చే క్రమంలో వారి చేతికి బేడీలు వేసి.. తీసుకొచ్చారు.
అయితే.. వారికి సోమవారమే బెయిల్ వచ్చినప్పటికీ.. పోలీసులు వారి చేతలు కు సంకెళ్లు వేస్తూ తీసుకురావటం పై రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. భువనగిరి మండలం రాయిగిరి గ్రామ రైతులు ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చాలంటూ డిమాండ్ చేస్తూ.. కొద్ది రోజులు గా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ తో తాము భూముల్ని కోల్పోతామన్నది వారి ఆవేదన. ఈ క్రమంలో మే 30న భువనగిరి కలెక్టరేట్ వద్ద ధర్నా చేయగా.. ఆ సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి కలెక్టరేట్ లో మీటింగ్ ముగించు కొని వెళుతున్నారు. ధర్నా చేస్తున్న రైతులు మూకుమ్మడిగా వెళ్లి మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఆరుగురు రైతుల పై కేసు నమోదు చేశారు. వారి లో నలుగురు రైతుల ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా.. మరో ఇద్దరు పరారీ లో ఉన్నట్లుగా పోలీసులు చూపారు. నలుగురు రైతుల ను తొలుత భువనగిరి సబ్ జైలు కు తరలించగా.. వారికి రాజకీయ నేతల పరామర్శలు ఎక్కువ కావటంతో శాంతిభద్రతల సమస్య చూపుతూ వారి ని నల్గొండ జైలు కు తరలించారు.
రిమాండ్ లో ఉన్న నలుగురు రైతుల కు సోమవారం భువనగిరి జిల్లా కోర్టులో కండిషనల్ బెయిల్ మంజూరైంది. అయితే.. బెయిల్ ప్రక్రియలో జాప్యం కావటంతో విడుదల ఆలస్యమైంది. సోమవారం 14రోజుల రిమాండ్ పూర్తి కావటంతో మంగళవారం ఉదయమే భువనగిరి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకురాగా.. ఈ సమయంలో రైతుల చేతికి సంకెళ్లు వేసి తీసుకురావటం పై వివాదం తలెత్తింది. దీని పై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ రైతులు మంగళవారం నల్గొండ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. రైతుల చేతుల కు బేడీలు వేయటం తనకు కన్నీళ్లు తెప్పించిందని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపర్చటమేనంటూ కేసీఆర్ సర్కారు తీరు పై విరుచుకుపడ్డారు. ఏమైనా.. రైతుల చేతుల కు బేడీలు వేయాల్సిన పెద్ద నేరం వారు చేయనప్పటికీ.. పోలీసుల అతి కేసీఆర్ సర్కారు కు తల నొప్పి గా మారిందన్న మాట వినిపిస్తోంది.
ఈ తీరు పై రాజకీయ పార్టీలు.. ప్రజా సంఘాలు తీవ్రస్థాయి లో మండిపడ్డాయి. పోలీసుల తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఉన్న రైతుల ను మంగళవారం భువనగిరి కోర్టు లో హాజరుపర్చేందుకు తీసుకు వచ్చే క్రమంలో వారి చేతికి బేడీలు వేసి.. తీసుకొచ్చారు.
అయితే.. వారికి సోమవారమే బెయిల్ వచ్చినప్పటికీ.. పోలీసులు వారి చేతలు కు సంకెళ్లు వేస్తూ తీసుకురావటం పై రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. భువనగిరి మండలం రాయిగిరి గ్రామ రైతులు ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చాలంటూ డిమాండ్ చేస్తూ.. కొద్ది రోజులు గా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ తో తాము భూముల్ని కోల్పోతామన్నది వారి ఆవేదన. ఈ క్రమంలో మే 30న భువనగిరి కలెక్టరేట్ వద్ద ధర్నా చేయగా.. ఆ సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి కలెక్టరేట్ లో మీటింగ్ ముగించు కొని వెళుతున్నారు. ధర్నా చేస్తున్న రైతులు మూకుమ్మడిగా వెళ్లి మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఆరుగురు రైతుల పై కేసు నమోదు చేశారు. వారి లో నలుగురు రైతుల ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా.. మరో ఇద్దరు పరారీ లో ఉన్నట్లుగా పోలీసులు చూపారు. నలుగురు రైతుల ను తొలుత భువనగిరి సబ్ జైలు కు తరలించగా.. వారికి రాజకీయ నేతల పరామర్శలు ఎక్కువ కావటంతో శాంతిభద్రతల సమస్య చూపుతూ వారి ని నల్గొండ జైలు కు తరలించారు.
రిమాండ్ లో ఉన్న నలుగురు రైతుల కు సోమవారం భువనగిరి జిల్లా కోర్టులో కండిషనల్ బెయిల్ మంజూరైంది. అయితే.. బెయిల్ ప్రక్రియలో జాప్యం కావటంతో విడుదల ఆలస్యమైంది. సోమవారం 14రోజుల రిమాండ్ పూర్తి కావటంతో మంగళవారం ఉదయమే భువనగిరి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకురాగా.. ఈ సమయంలో రైతుల చేతికి సంకెళ్లు వేసి తీసుకురావటం పై వివాదం తలెత్తింది. దీని పై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ రైతులు మంగళవారం నల్గొండ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. రైతుల చేతుల కు బేడీలు వేయటం తనకు కన్నీళ్లు తెప్పించిందని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపర్చటమేనంటూ కేసీఆర్ సర్కారు తీరు పై విరుచుకుపడ్డారు. ఏమైనా.. రైతుల చేతుల కు బేడీలు వేయాల్సిన పెద్ద నేరం వారు చేయనప్పటికీ.. పోలీసుల అతి కేసీఆర్ సర్కారు కు తల నొప్పి గా మారిందన్న మాట వినిపిస్తోంది.