Begin typing your search above and press return to search.
రెండేళ్లలో రైతు అపార సంపదలు ... ఐటీ సోదాల్లో షాకింగ్ నిజాలు
By: Tupaki Desk | 29 Nov 2020 11:30 PM GMTగతంలో ఓ వెలుగు వెలిగి ఆర్థికంగా చితికిపోయిన రైతు రెండేళ్లల్లోనే అపర కుబేరుడిగా ఎదిగాడు. ఆయన కు అపార సంపదలు వచ్చిన చేరినట్టు ఆదాయ పన్ను శాఖ దృష్టికి చేరింది. దీనితో ఆ రైతు ఇంటిలో ఐటీ వర్గాలు సోదాలు నిర్వహిస్తున్నారు. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని ముత్తుకృష్ణాపురం చెందిన సుగీష్ చంద్రన్ మోతుబారి రైతు. ఒకప్పుడు భారీగా ఆస్తులున్నా క్రమంగా అవి కరిగిపోయాయి. కొన్నేళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అయితే, రెండేళ్లలో వీరి సంపద ఊహించని విధంగా రెట్టింపయినట్టు ఐటీ పరిశీలనలో తేలింది. ఒకప్పుడు వీరికి పంట పొలాలు ఎక్కువే. అయితే క్రమంగా ఆస్తులు కరిగిపోయాయి. కొన్నేళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోవాల్సిన పరిస్థితి.
దీని వెనుక చెన్నైలోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఆయన కుమారుడు, ముంబైలో మరో సంస్థలో పనిచేస్తున్న కుమార్తె, అల్లుడు హస్తం ఉన్నట్టు ఐటీ శాఖ విచారణలో వెల్లడయ్యింది. కరోనా కట్టిడికి విధించిన లాక్ డౌన్ కు ముందు ఆ గ్రామంలో రాధాకృష్ణన్ అనే వ్యక్తికి చెందిన పురాతన బంగళాను సైతం కొనుగోలు చేశారు. దీంతో వారం రోజులుగా ఐటీ వర్గాలు ఈ రైతు కుటుంబం ఆదాయ వివరాల సేకరణపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఐటీ అధికారులు ఆ ఇంటిపై దాడిచేసి సోదాలు నిర్వహించారు. ఇవి శనివారం కూడా కొనసాగాయి. పదుల సంఖ్యలో వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ప్రతి అంగుళం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఆ రైతు కుటుంబానికి అపార సంపద హఠాత్తుగా ఎలా వచ్చిందో గుట్టురట్టు చేయాలని కంకణం కట్టుకున్నారు. చెన్నైలోని అతడి కుమారుడు, కోడలు, ముంబైలోని కుమార్తె, అల్లుడి నివాసాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. ఉండవల్లి ఇటీవల, చెన్నైలోని ఐటీ ఇన్ఫ్రా సంస్థపై చేసిన దాడుల్లో ఏకంగా వేయి కోట్ల నల్లధనం బయటపడింది. తమిళనాడులోని చెన్నై, మధురైలో ఉన్న ఆ ఐటీ సంస్థకు చెందిన ఐదు కార్యాలయాలపై ఏకకాలంలో ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించింది. ఈ ఐటీ కంపెనీ సింగపూర్ కు చెందిన కంపెనీలో కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. చెన్నైలోని ఆ రైతు కుమారుడు, కోడలు, ముంబైలోని కుమార్తె, అల్లుడ్ని టార్గెట్ చేసి ఐటీ వర్గాలు దర్యాప్తు, తనిఖీల వేగం పెరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దీని వెనుక చెన్నైలోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఆయన కుమారుడు, ముంబైలో మరో సంస్థలో పనిచేస్తున్న కుమార్తె, అల్లుడు హస్తం ఉన్నట్టు ఐటీ శాఖ విచారణలో వెల్లడయ్యింది. కరోనా కట్టిడికి విధించిన లాక్ డౌన్ కు ముందు ఆ గ్రామంలో రాధాకృష్ణన్ అనే వ్యక్తికి చెందిన పురాతన బంగళాను సైతం కొనుగోలు చేశారు. దీంతో వారం రోజులుగా ఐటీ వర్గాలు ఈ రైతు కుటుంబం ఆదాయ వివరాల సేకరణపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఐటీ అధికారులు ఆ ఇంటిపై దాడిచేసి సోదాలు నిర్వహించారు. ఇవి శనివారం కూడా కొనసాగాయి. పదుల సంఖ్యలో వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ప్రతి అంగుళం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఆ రైతు కుటుంబానికి అపార సంపద హఠాత్తుగా ఎలా వచ్చిందో గుట్టురట్టు చేయాలని కంకణం కట్టుకున్నారు. చెన్నైలోని అతడి కుమారుడు, కోడలు, ముంబైలోని కుమార్తె, అల్లుడి నివాసాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. ఉండవల్లి ఇటీవల, చెన్నైలోని ఐటీ ఇన్ఫ్రా సంస్థపై చేసిన దాడుల్లో ఏకంగా వేయి కోట్ల నల్లధనం బయటపడింది. తమిళనాడులోని చెన్నై, మధురైలో ఉన్న ఆ ఐటీ సంస్థకు చెందిన ఐదు కార్యాలయాలపై ఏకకాలంలో ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించింది. ఈ ఐటీ కంపెనీ సింగపూర్ కు చెందిన కంపెనీలో కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. చెన్నైలోని ఆ రైతు కుమారుడు, కోడలు, ముంబైలోని కుమార్తె, అల్లుడ్ని టార్గెట్ చేసి ఐటీ వర్గాలు దర్యాప్తు, తనిఖీల వేగం పెరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.