Begin typing your search above and press return to search.
సాగు చట్టాలపై రైతుల ఆందోళన ... సుప్రీం లో మరో రెండు పిటిషన్లు!
By: Tupaki Desk | 29 Jan 2021 6:50 AM GMTకేంద్రం కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలని అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే , ఈ కొత్త సాగు చట్టాల వల్ల రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది అంటూ రైతులు గత రెండు నెలల సమయం నుండి ఆందోళన నిర్వహిస్తున్నారు. కేంద్రం తో పలు ధపాలుగా చర్చలు జరిపినా కూడా రైతులు , కేంద్రం మెట్టు దిగకపోవడంతో ఆ చర్చలు సఫలం కాలేదు. ఇక తాజాగా రిపబ్లిక్ డే రోజు రైతులు నిర్వహించిన కిసాన్ పరేడ్ లో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఆ తర్వాత ఈ ఆందోళనల నుండి ఇప్పటి వరకు నాలుగు రైతు సంఘాలు ఆందోళన నుంచి తప్పుకోగా... మిగతా సంఘాలు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక, రైతుల ఆందోళనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు, రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింస, విధ్వంసంపై పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరపాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు కాగా, ఏలాంటి సాక్షాధారాలు లేకుండా రైతులను తీవ్రవాదులుగా పేర్కొనరాదని మీడియాకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది.
మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కూడా ఇలాంటి పిటిషనే దాఖలు చేశారు. రైతుల ఆందోళన పేరుతో రహదారులు, బహిరంగ ప్రదేశాలలో బైఠాయించిన వారందరినీ తొలగించాలని కోరారు పిటిషనర్, ఎర్ర కోట సంఘటనకు సంబంధించి విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారనే కారణంగా పోలీసు అధికారులను శిక్షించాలని, తక్షణమే ఢిల్లీ పోలీసు కమిషనర్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక, గురువారం నుంచి రైతు శిబిరాల దగ్గర పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులను ఖాళీ చేయించడానికి పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించగా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు రైతులు.
ఆ తర్వాత ఈ ఆందోళనల నుండి ఇప్పటి వరకు నాలుగు రైతు సంఘాలు ఆందోళన నుంచి తప్పుకోగా... మిగతా సంఘాలు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక, రైతుల ఆందోళనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు, రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింస, విధ్వంసంపై పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరపాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు కాగా, ఏలాంటి సాక్షాధారాలు లేకుండా రైతులను తీవ్రవాదులుగా పేర్కొనరాదని మీడియాకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది.
మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కూడా ఇలాంటి పిటిషనే దాఖలు చేశారు. రైతుల ఆందోళన పేరుతో రహదారులు, బహిరంగ ప్రదేశాలలో బైఠాయించిన వారందరినీ తొలగించాలని కోరారు పిటిషనర్, ఎర్ర కోట సంఘటనకు సంబంధించి విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారనే కారణంగా పోలీసు అధికారులను శిక్షించాలని, తక్షణమే ఢిల్లీ పోలీసు కమిషనర్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక, గురువారం నుంచి రైతు శిబిరాల దగ్గర పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులను ఖాళీ చేయించడానికి పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించగా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు రైతులు.