Begin typing your search above and press return to search.
ఎర్రకోట వద్ద జెండా ఎగురవేసింది ఎవరు? ఇప్పుడెక్కడ ఉన్నాడు?
By: Tupaki Desk | 29 Jan 2021 11:30 AM GMTప్రపంచం వ్యాప్తంగా సంచలనంగా మారి.. దేశంలో పెద్ద చర్చకు కారణమైన ఎర్రకోట వద్ద సిక్కు మతస్తులకు చెందిన జెండా ఎగురవేసిన వైనం గురించి తెలిసిందే. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం పెను సంచలనమైంది. జాతీయ పతాకాన్ని తీసేసి.. తమ జెండాను పెట్టినట్లుగా తప్పుడు వార్తలు వైరల్ అయినా.. జాతీయ పతాకానికి కాస్త దూరంగా.. ఈ జెండాను ఎగురవేయటం తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ గా ఉంది.
ఇదిలా ఉండగా... స్తంభం ఎక్కి జెండా ఎగురవేసింది ఎవరు? అన్నది ప్రశ్నగా మారగా.. దానికి సమాదానాన్ని వెతికారు పోలీసులు. పంజాబ్ లోని తరన్ తారన్ జిల్లా వేన్ తారాసింగ్ కు చెందిన జుగరాజ్ సింగ్ అనే 23 ఏళ్ల వ్యక్తిగా తేల్చారు. అతడి గురించి వివరాలు అందినంతనే.. అతని ఇంటికి వెళ్లి పలుమార్లు సోదాలు నిర్వహించారు. ఈ పని చేసింది తన కొడుకేనని తొలుత గర్వపడ్డారు అతని తల్లిదండ్రులు.
కానీ.. పోలీసులు.. కేసులకు భయపడిన వారు ఊరు విడిచి పారిపోయారు. వారిప్పుడు ఎక్కడ ఉన్నారో తెలీని పరిస్థితి. ఇంటి దగ్గర మాత్రం జుగరాజ్ తాత.. నానమ్మలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ఆచూకీ బయటకు రాలేదు. ఎర్రకోట ఉదంతం తర్వాత.. కొన్ని రైతు సంఘాలు తాము చేస్తున్న ఆందోళనపై పునరాలోచనలో పడ్డాయి. భారతీయ కిసాన్ యూనియన్ (లోక్ శక్తి).. కిసాన్ మహా పంచాయత్ సంస్థలు ఆందోళ నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించాయి.
ఇదిలా ఉండగా... స్తంభం ఎక్కి జెండా ఎగురవేసింది ఎవరు? అన్నది ప్రశ్నగా మారగా.. దానికి సమాదానాన్ని వెతికారు పోలీసులు. పంజాబ్ లోని తరన్ తారన్ జిల్లా వేన్ తారాసింగ్ కు చెందిన జుగరాజ్ సింగ్ అనే 23 ఏళ్ల వ్యక్తిగా తేల్చారు. అతడి గురించి వివరాలు అందినంతనే.. అతని ఇంటికి వెళ్లి పలుమార్లు సోదాలు నిర్వహించారు. ఈ పని చేసింది తన కొడుకేనని తొలుత గర్వపడ్డారు అతని తల్లిదండ్రులు.
కానీ.. పోలీసులు.. కేసులకు భయపడిన వారు ఊరు విడిచి పారిపోయారు. వారిప్పుడు ఎక్కడ ఉన్నారో తెలీని పరిస్థితి. ఇంటి దగ్గర మాత్రం జుగరాజ్ తాత.. నానమ్మలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ఆచూకీ బయటకు రాలేదు. ఎర్రకోట ఉదంతం తర్వాత.. కొన్ని రైతు సంఘాలు తాము చేస్తున్న ఆందోళనపై పునరాలోచనలో పడ్డాయి. భారతీయ కిసాన్ యూనియన్ (లోక్ శక్తి).. కిసాన్ మహా పంచాయత్ సంస్థలు ఆందోళ నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించాయి.