Begin typing your search above and press return to search.
ఢిల్లీలో అల్లర్లు - అమెరికా అలర్ట్...రాయబార కార్యాలయాలకు హెచ్చరికలు..!
By: Tupaki Desk | 27 Jan 2021 4:12 AM GMTనిన్న ఢిల్లీలో రైతుసంఘాల ఆధ్వర్యంలో జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం భారత్లోని తమ పౌరులకు జాగ్రత్తలు తెలిపింది. రైతల ఆందోళన దృష్ట్యా సమస్యాత్మక ప్రాంతాల్లో తిరగొద్దని ఢిల్లీలోని తమ పౌరులకు సూచించింది. అంతేకాక రాయబార కార్యాలయాలకు కూడా హెచ్చరికలు జారీచేసింది. గణ తంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. శాంతియుతంగా జరుగుతుందనుకున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు.
మరోవైపు ఢిల్లీలోని ఎర్రకోటపై రైతులు జెండాలు ఎగరవేశారు. అయితే రైతుల ఆందోళనల్లోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయని రైతుసంఘాలే ఆరోపించాయి. మరోవైపు పలువురు ఆందోళనకారులు ఢిల్లీ వీధుల్లో కత్తులు తిప్పడం.. ట్రాక్టర్లను పోలీసుల మీదకు తీసుకెళ్లడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా దేశాల రాయబార కార్యాలయాలు కూడా అలర్టయ్యాయి. మరోవైపు హింసాత్మక ఘటనల నేపథ్యంలో పంజాబ్, హర్యానాలో అలర్ట్ ప్రకటించారు.
ఇప్పటికే ఢిల్లీలోని మెట్రోస్టేషన్ను మూసివేశారు. పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం ఎర్రకోట ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంటు, విజయ్ చౌక్, రాజ్ పథ్, ఇండియా గేట్ వైపు వెళ్లే మార్గాలను దిగ్బంధించారు.
అయితే రైతులు ముందు అనుమతించిన మార్గాల్లో కాకుండా.. వేరే రూట్లో వెళ్లడంతో హింస చెలరేగింది. చివరకు రైతులు ఎర్రకోట మీదకు వెళ్లి జెండాలు ఎగరవేయడం ఉద్రిక్తతతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అమిత్ షా పోలీసులు, నిఘా అధికారులతో అత్యవసరంగా సమావేశమమయ్యారు.
మరోవైపు ఢిల్లీలోని ఎర్రకోటపై రైతులు జెండాలు ఎగరవేశారు. అయితే రైతుల ఆందోళనల్లోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయని రైతుసంఘాలే ఆరోపించాయి. మరోవైపు పలువురు ఆందోళనకారులు ఢిల్లీ వీధుల్లో కత్తులు తిప్పడం.. ట్రాక్టర్లను పోలీసుల మీదకు తీసుకెళ్లడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా దేశాల రాయబార కార్యాలయాలు కూడా అలర్టయ్యాయి. మరోవైపు హింసాత్మక ఘటనల నేపథ్యంలో పంజాబ్, హర్యానాలో అలర్ట్ ప్రకటించారు.
ఇప్పటికే ఢిల్లీలోని మెట్రోస్టేషన్ను మూసివేశారు. పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం ఎర్రకోట ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంటు, విజయ్ చౌక్, రాజ్ పథ్, ఇండియా గేట్ వైపు వెళ్లే మార్గాలను దిగ్బంధించారు.
అయితే రైతులు ముందు అనుమతించిన మార్గాల్లో కాకుండా.. వేరే రూట్లో వెళ్లడంతో హింస చెలరేగింది. చివరకు రైతులు ఎర్రకోట మీదకు వెళ్లి జెండాలు ఎగరవేయడం ఉద్రిక్తతతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అమిత్ షా పోలీసులు, నిఘా అధికారులతో అత్యవసరంగా సమావేశమమయ్యారు.