Begin typing your search above and press return to search.
ఫాస్టాగ్ దూకుడు.. ఒకరోజు కలెక్షన్ రూ.193 కోట్లు
By: Tupaki Desk | 3 May 2023 10:14 AM GMTదేశ వ్యాప్తంగా ఉన్న టోల్ వసూళ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ వసూళ్లలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ వ్యవస్థ ద్వారా వాహనదారులు ఒక రోజులో చెల్లించిన చెల్లింపుల వివరాలు బయటకు వచ్చాయి.
ఒక రోజులో అత్యధికంగా వసూలైన టోల్ ఛార్జీల వివరాల్ని చూస్తే.. రానున్న రోజుల్లో ఇవెంత భారీగా మారనున్నాయి? అన్న విషయం అర్థమవుతుంది. తాజాగా ఒకరోజులో దేశ వ్యాప్తంగా ఉన్న ఫాస్టాగ్ వసూళ్లు రూ.193 కోట్లు వసూళ్లు సాధించటం ఆసక్తికరంగా మారింది.
ఈ భారీ చెల్లింపులు ఏప్రిల్ 29న చోటు చేసుకున్నట్లుగా జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ ఒక్కరోజునే 1.16 కోట్ల వాహనాల ద్వారా ఈ భారీ వసూళ్లు వచ్చినట్లుగా పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం అన్ని ప్రైవేటు.. వాణిజ్య వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు మొత్తానని వసూలు చేస్తున్నారు. ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక రోజులో ఇంత భారీగా వసూళ్లు రావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాలు 770 ఉండగా.. వాటిని 1228కు పెంచారు. ఇందులో 339 రాష్ట్ర టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా జారీ చేసిన ఫాస్టాగ్ కార్డులు 6.9 కోట్లు. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించటం.. టోల్ వసూళ్ల ప్రాంతంలో ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అయ్యే వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
వాహనానికి ముందు చిప్ తో కూడిన స్టిక్కర్ ను అతికించటం.. సెన్సర్ల ద్వారా సదరు వాహనదారుడి ఫాస్టాగ్ ఖాతాలో ఉన్న మొత్తంలో టోల్ మొత్తం ఆటోమేటిక్ గా కట్ కావటం తెలిసిందే. తమ ఖాతాలో తక్కువ బ్యాలెన్సు ఉంటే.. ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవటం.. లేదంటే ఆటోమేటిక్ గా ఖాతాలోడబ్బులు క్రెడిట్ అయ్యేలా బ్యాంకు ఖాతాలకు ఆదేశాలు ఇచ్చే వెసులుబాటు ఉండటం తెలిసిందే.
ఇప్పుడే ఇంత భారీగా వసూళ్లు వచ్చాయంటే.. రానున్న పదేళ్లు.. ఇరవైఏళ్లలో ఈ మొత్తాలు ఎంత భారీగా ఉంటాయన్నది ఇట్టే అర్థం కాక మానదు.
ఒక రోజులో అత్యధికంగా వసూలైన టోల్ ఛార్జీల వివరాల్ని చూస్తే.. రానున్న రోజుల్లో ఇవెంత భారీగా మారనున్నాయి? అన్న విషయం అర్థమవుతుంది. తాజాగా ఒకరోజులో దేశ వ్యాప్తంగా ఉన్న ఫాస్టాగ్ వసూళ్లు రూ.193 కోట్లు వసూళ్లు సాధించటం ఆసక్తికరంగా మారింది.
ఈ భారీ చెల్లింపులు ఏప్రిల్ 29న చోటు చేసుకున్నట్లుగా జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ ఒక్కరోజునే 1.16 కోట్ల వాహనాల ద్వారా ఈ భారీ వసూళ్లు వచ్చినట్లుగా పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం అన్ని ప్రైవేటు.. వాణిజ్య వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు మొత్తానని వసూలు చేస్తున్నారు. ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక రోజులో ఇంత భారీగా వసూళ్లు రావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాలు 770 ఉండగా.. వాటిని 1228కు పెంచారు. ఇందులో 339 రాష్ట్ర టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా జారీ చేసిన ఫాస్టాగ్ కార్డులు 6.9 కోట్లు. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించటం.. టోల్ వసూళ్ల ప్రాంతంలో ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అయ్యే వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
వాహనానికి ముందు చిప్ తో కూడిన స్టిక్కర్ ను అతికించటం.. సెన్సర్ల ద్వారా సదరు వాహనదారుడి ఫాస్టాగ్ ఖాతాలో ఉన్న మొత్తంలో టోల్ మొత్తం ఆటోమేటిక్ గా కట్ కావటం తెలిసిందే. తమ ఖాతాలో తక్కువ బ్యాలెన్సు ఉంటే.. ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవటం.. లేదంటే ఆటోమేటిక్ గా ఖాతాలోడబ్బులు క్రెడిట్ అయ్యేలా బ్యాంకు ఖాతాలకు ఆదేశాలు ఇచ్చే వెసులుబాటు ఉండటం తెలిసిందే.
ఇప్పుడే ఇంత భారీగా వసూళ్లు వచ్చాయంటే.. రానున్న పదేళ్లు.. ఇరవైఏళ్లలో ఈ మొత్తాలు ఎంత భారీగా ఉంటాయన్నది ఇట్టే అర్థం కాక మానదు.