Begin typing your search above and press return to search.
కొడుకు అంత్యక్రియల కోసం తండ్రి ఆరాటం.. 8 నెలలుగా గాలింపు!
By: Tupaki Desk | 2 April 2021 11:30 PM GMTఅల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కొన్ని రోజుల తర్వాత రక్తపు మరకలు గల దుస్తులు కనిపించాయి. ఎంతో గారాబంగా పెంచుకున్న తమ కుమారుడికి చిన్న ఆపద వస్తేనే అల్లాడి పోయే ఆ తల్లిదండ్రులు ఇక రాడని తెలిసి శోక సంద్రంలో మునిగిపోయారు. నవ్వుతూ బయటకు వెళ్లిన తమ కుమారుడు తిరిగి ఇంటికి రాడని తెలిసి వారు పడే వేదన వర్ణనాతీతం. ఎంతో ముద్దుగా పెంచుకున్న కుమారుడిని కనీసం చివరి చూపునకు నోచుకోలోకపోయామని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎలాగైనా సరే మృతదేహాన్ని వెతికి అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు ఆ తండ్రి.
కొడుకుకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆరాటపడుతున్నారు. అందుకే ఎనిమిది నెలలుగా మృతదేహం కోసం తవ్వకాలు చేపట్టారు. అయినా ఇప్పటికీ గుర్తించలేకపోయారు. కశ్మీర్కు చెందిన చెందిన షకీర్ గతేడాది ఆగస్టు 2న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి అతడి ద్విచక్రవాహనం కుల్గాంలో కాలిపోయి కన్పించింది. ఇక తమ కొడుకుకు ఏదో జరగరానిదే జరగిందని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. వారం రోజుల తర్వాత వారి ఇంటికి మూడు కిలోమీటర్ల సమీపంలో షకీర్ దుస్తులు కనిపించాయి. అవి పూర్తిగా రక్తపు మరకలతో నిండి ఉన్నాయి.
రక్తపు మరకలతో ఉన్న షకీర్ దుస్తులను చూసిన అతడి తండ్రి మంజూర్... తన కొడుకు మృతి చెందాడని నిర్ధారించుకున్నారు. మిలిటెంట్ల కాల్పుల్లో షకీర్ ప్రాణాలు కోల్పోయాడని భావించారు. నాటి నుంచి షకీర్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఎలాగైనా అంత్యక్రియలు జరపాలని ఎదురు చూస్తున్నారు. అందుకే దాదాపు ఎనిమిది నెలల నుంచి తవ్వకాలు చేపట్టారు. నేటికీ షకీర్ మృతదేహం లభ్యం కాలేదు. కొడుకు అంతిమ సంస్కారాల కోసం ఆ తండ్రి పడే యాతనను అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
కొడుకుకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆరాటపడుతున్నారు. అందుకే ఎనిమిది నెలలుగా మృతదేహం కోసం తవ్వకాలు చేపట్టారు. అయినా ఇప్పటికీ గుర్తించలేకపోయారు. కశ్మీర్కు చెందిన చెందిన షకీర్ గతేడాది ఆగస్టు 2న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి అతడి ద్విచక్రవాహనం కుల్గాంలో కాలిపోయి కన్పించింది. ఇక తమ కొడుకుకు ఏదో జరగరానిదే జరగిందని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. వారం రోజుల తర్వాత వారి ఇంటికి మూడు కిలోమీటర్ల సమీపంలో షకీర్ దుస్తులు కనిపించాయి. అవి పూర్తిగా రక్తపు మరకలతో నిండి ఉన్నాయి.
రక్తపు మరకలతో ఉన్న షకీర్ దుస్తులను చూసిన అతడి తండ్రి మంజూర్... తన కొడుకు మృతి చెందాడని నిర్ధారించుకున్నారు. మిలిటెంట్ల కాల్పుల్లో షకీర్ ప్రాణాలు కోల్పోయాడని భావించారు. నాటి నుంచి షకీర్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఎలాగైనా అంత్యక్రియలు జరపాలని ఎదురు చూస్తున్నారు. అందుకే దాదాపు ఎనిమిది నెలల నుంచి తవ్వకాలు చేపట్టారు. నేటికీ షకీర్ మృతదేహం లభ్యం కాలేదు. కొడుకు అంతిమ సంస్కారాల కోసం ఆ తండ్రి పడే యాతనను అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.