Begin typing your search above and press return to search.
జడ్పీటీసీ టు టీపీసీసీ: దూకుడే రేవంత్ ‘మంత్రం’
By: Tupaki Desk | 7 July 2021 7:03 AM GMTఒక జడ్పీటీసీగా అతడి ప్రయాణం మొదలైంది. యువకుడు, ఉత్సాహవంతుడు.. అన్నింటికి మించి దూకుడులో మహేష్ బాబును మించి రాజకీయాల్లో దూకుడు కనబరిచాడు. అందుకే స్వల్ప కాలంలోనే జడ్పీటీసీ నుంచి టీపీసీసీ చీఫ్ గా ఎదిగాడు.. గులాబీ పార్టీని కాలదన్నీ టీడీపీలో చేరి అనంతరం కాంగ్రెస్ లోకి దూకి మూడున్నర ఏళ్లలోనే అనుకున్న లక్ష్యం సాధించాడు. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాడు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించినా.. కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడానికి రేవంత్ రెడ్డి దూకుడే కారణం.. కేసీఆర్ ను ఢీకొట్టే దూకుడు, మాటకారితనం.. వ్యూహచతురత, ప్రజా సమస్యలపై పోరాడే నైజమే రేవంత్ రెడ్డి అందరి నేతల్లోకి ప్రత్యేకంగా నిలిపింది. ఈ అందలం ఎక్కించింది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డికి అని ప్రకటించగానే చచ్చుబడిన కాంగ్రెస్ కు జవసత్వాలు వచ్చాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. సీనియర్లను ఒక్కొక్కరిని కూల్ చేస్తూ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలుస్తూ వారిని బుజ్జగిస్తున్న తీరు నాయకత్వ లక్షణాలకు నిదర్శనంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి ఈరోజు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ క్రమంలోనే ఆయన రాజకీయ జీవితంపై స్పెషల్ స్టోరీ..
ఒక చిన్న గ్రామంలో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో రేవంత్ రెడ్డి జన్మించాడు. ఇప్పుడు 100 ఏళ్ల ఉద్దండ కాంగ్రెస్ ను మెప్పించి పీసీసీ చీఫ్ గా ఎదిగాడటంటే అతడి వెనుక అలుపెరగని కృషి ఉంది. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు ఆయన ప్రస్థానం సాగింది. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత కాబట్టే ఇప్పుడు అందలం దక్కింది.
మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు. చిన్నప్పటికి అందరితో కలిసిపోయే మనస్తత్వం, దూకుడు ఆయనకు కలిసి వచ్చింది. యువకుడిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ లో చేరి తొలుత జడ్పీటీసీ టికెట్ ఆశించాడు. కానీ టీఆర్ఎస్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మిడ్గిల్ జడ్పీటీసీగా గెలిచాడు. 2008లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. అలా మహబూబ్ నగర్ జిల్లా నేతగా ఎదిగారు.
ఆ తర్వాత టీడీపీలో చేరి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అసెంబ్లీలో నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించి ప్రజల్లో మీడియాలో ఫేమస్ అయ్యారు. చంద్రబాబు సైతం యువకుడైన రేవంత్ రెడ్డిని ప్రోత్సహించారు. ఓటుకు నోటులో పట్టుబడడం రేవంత్ రెడ్డి కెరీర్ లో మైనస్ గా మారింది. అయితే తదనంతర కాలంలో టీడీపీ తెలంగాణలో కుదేలు కావడంతో కాంగ్రెస్ లో చేరారు.
అయితే సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు, పోరాటాలు చేయడంతో రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యారు. అందుకే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ను గెలవకుండా చేయడానికి కేసీఆర్ పెద్ద స్కెచ్ వేసి హరీష్ రావును రంగంలోకి దించి మరీ రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఓడించారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో తేరుకున్న రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో పోటీచేసి ఈసారి ప్రజలను మెప్పించి గెలిచాడు. అదే ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్ గా మారింది. కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇక తన రాజకీయ భవష్యత్ ఖతమేనా? అనుకుంటున్న టైంలో మల్కాజిగిరి ప్రజల ప్రోత్సాహంతో ఎంపీగా గెలిచి ఇప్పుడు పీసీసీ చీఫ్ గా ఎదిగే వరకు ఆయన ప్రయాణం సాగింది. ఎంపీగా గెలవకుంటే ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి దక్కి ఉండేదే కాదన్న అభిప్రాయం ఉంది.
కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించినా.. అడ్డంకులు సృష్టించినా.. బలమైన లాబీ ఎదురు వచ్చినా గ్రూపులు వర్గాలు, ఫిర్యాదులు, ప్రశంసలు అన్నింటిని లెక్కలు వేసుకుంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి పీసీసీ చీప్ గా నేడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన లక్ష్యం తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దెదించడం.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం.. ఆ తర్వాత అధిష్టానం ఒప్పుకుంటే సీఎం పీఠం. ఆ లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి సాగాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా నూతన పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డికి మన తరుఫున కూడా శుభాకాంక్షలు చెబుదాం.. ఆల్ ది బెస్ట్.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించినా.. కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడానికి రేవంత్ రెడ్డి దూకుడే కారణం.. కేసీఆర్ ను ఢీకొట్టే దూకుడు, మాటకారితనం.. వ్యూహచతురత, ప్రజా సమస్యలపై పోరాడే నైజమే రేవంత్ రెడ్డి అందరి నేతల్లోకి ప్రత్యేకంగా నిలిపింది. ఈ అందలం ఎక్కించింది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డికి అని ప్రకటించగానే చచ్చుబడిన కాంగ్రెస్ కు జవసత్వాలు వచ్చాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. సీనియర్లను ఒక్కొక్కరిని కూల్ చేస్తూ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలుస్తూ వారిని బుజ్జగిస్తున్న తీరు నాయకత్వ లక్షణాలకు నిదర్శనంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి ఈరోజు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ క్రమంలోనే ఆయన రాజకీయ జీవితంపై స్పెషల్ స్టోరీ..
ఒక చిన్న గ్రామంలో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో రేవంత్ రెడ్డి జన్మించాడు. ఇప్పుడు 100 ఏళ్ల ఉద్దండ కాంగ్రెస్ ను మెప్పించి పీసీసీ చీఫ్ గా ఎదిగాడటంటే అతడి వెనుక అలుపెరగని కృషి ఉంది. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు ఆయన ప్రస్థానం సాగింది. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత కాబట్టే ఇప్పుడు అందలం దక్కింది.
మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు. చిన్నప్పటికి అందరితో కలిసిపోయే మనస్తత్వం, దూకుడు ఆయనకు కలిసి వచ్చింది. యువకుడిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ లో చేరి తొలుత జడ్పీటీసీ టికెట్ ఆశించాడు. కానీ టీఆర్ఎస్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మిడ్గిల్ జడ్పీటీసీగా గెలిచాడు. 2008లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. అలా మహబూబ్ నగర్ జిల్లా నేతగా ఎదిగారు.
ఆ తర్వాత టీడీపీలో చేరి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అసెంబ్లీలో నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించి ప్రజల్లో మీడియాలో ఫేమస్ అయ్యారు. చంద్రబాబు సైతం యువకుడైన రేవంత్ రెడ్డిని ప్రోత్సహించారు. ఓటుకు నోటులో పట్టుబడడం రేవంత్ రెడ్డి కెరీర్ లో మైనస్ గా మారింది. అయితే తదనంతర కాలంలో టీడీపీ తెలంగాణలో కుదేలు కావడంతో కాంగ్రెస్ లో చేరారు.
అయితే సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు, పోరాటాలు చేయడంతో రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యారు. అందుకే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ను గెలవకుండా చేయడానికి కేసీఆర్ పెద్ద స్కెచ్ వేసి హరీష్ రావును రంగంలోకి దించి మరీ రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఓడించారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో తేరుకున్న రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో పోటీచేసి ఈసారి ప్రజలను మెప్పించి గెలిచాడు. అదే ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్ గా మారింది. కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇక తన రాజకీయ భవష్యత్ ఖతమేనా? అనుకుంటున్న టైంలో మల్కాజిగిరి ప్రజల ప్రోత్సాహంతో ఎంపీగా గెలిచి ఇప్పుడు పీసీసీ చీఫ్ గా ఎదిగే వరకు ఆయన ప్రయాణం సాగింది. ఎంపీగా గెలవకుంటే ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి దక్కి ఉండేదే కాదన్న అభిప్రాయం ఉంది.
కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించినా.. అడ్డంకులు సృష్టించినా.. బలమైన లాబీ ఎదురు వచ్చినా గ్రూపులు వర్గాలు, ఫిర్యాదులు, ప్రశంసలు అన్నింటిని లెక్కలు వేసుకుంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి పీసీసీ చీప్ గా నేడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన లక్ష్యం తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దెదించడం.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం.. ఆ తర్వాత అధిష్టానం ఒప్పుకుంటే సీఎం పీఠం. ఆ లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి సాగాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా నూతన పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డికి మన తరుఫున కూడా శుభాకాంక్షలు చెబుదాం.. ఆల్ ది బెస్ట్.