Begin typing your search above and press return to search.

కలవటానికి నో చెప్పిన లవ్వర్ ను చంపేశాడు!

By:  Tupaki Desk   |   19 July 2020 11:30 PM GMT
కలవటానికి నో చెప్పిన లవ్వర్ ను చంపేశాడు!
X
తమిళనాడులో చోటు చేసుకున్న దారుణం విన్నంతనే అయ్యో అనుకునేలా చేస్తుంది. తన ప్రేమను ఇంట్లో వారి మాటల ప్రభావానికి లోనై.. నో చెప్పిందన్న కోపంతో దారుణంగా హతమార్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ప్రేమోన్మాదం వివరాల్లోకి వెళితే..

కోయంబత్తూరు సిటీకి చెందిన 18 ఏళ్ల ఐశ్వర్య ఒక ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. నగరానికి చెందిన 24 ఏళ్ల రితీష్ పరిచయమయ్యాడు. ఇద్దరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వారికి.. లాక్ డౌన్ కొత్త సమస్యల్ని తీసుకొచ్చింది. ఎవరిళ్లలో వారు ఉండే పరిస్థితి రావటంతో ప్రియురాల్ని చూసే అవకాశం లేకుండా పోయింది రితీశ్ కు.

దీంతో.. తాను ప్రేమించిన అమ్మాయిని చూడాలన్న తపనతో ఒక సాహసం చేశాడు. ఆమె ఇంటికి వెళ్లిన అతడు ఇంటి కుటుంబ సభ్యుల ఎదుట బుక్ అయ్యాడు. దీంతో.. ఐశ్వర్య కుటుంబ సభ్యులు తీవ్రంగా మందలించి హెచ్చరించారు. అదే సమయంలో ఐశ్వర్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో.. అప్పటినుంచి రితీశ్ ను పక్కన పెట్టేసింది ఐశ్వర్య.

తనను ప్రేమించిన అమ్మాయి దూరం కావటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమెతో మాట్లాడేందుకు పలు విధాలుగా ప్రయత్నించాడు రితీశ్. అయినప్పటికీ ఐశ్వర్య పట్టించుకోలేదు. అతడి ప్రేమను రిజెక్టు చేయటం షురూ చేసింది. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన రితీశ్ ఆమె పట్ల రగిలిపోతున్నాడు. తాజాగా రాత్రి ఏడు గంటల సమయంలో ఐశ్వర్య ఇంటికి వెళ్లాడు. తనను ప్రేమిస్తున్నది లేనిది చెప్పాలని నిలదీశాడు. దీంతో.. అతడ్ని ప్రేమించటం లేదని ఐశ్వర్య తేల్చి చెప్పటంతో కోపంతో ఉన్మాదిగా మారాడు.

తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇష్టానుసారం దాడి చేశాడు. అతడి దుశ్చర్యకు అడ్గుగా వచ్చినఐశ్వర్య తండ్రిపైనా దాడి చేశాడు. ఈ ఉదంతంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఉన్మాదిగా మారిన రితీష్.. ఐశ్వర్యను విచక్షణరహితంగా గాయపరిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలకు గురైన తండ్రి..కూతురిని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఐశ్వర్య ఆసుపత్రిలో మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రితీశ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.