Begin typing your search above and press return to search.

మహాత్ముడికి ఘోర అవమానం..

By:  Tupaki Desk   |   5 Jan 2020 4:14 PM IST
మహాత్ముడికి ఘోర అవమానం..
X
గాంధీ పుట్టిన రాష్ట్రం అదీ. ఆయన సొంత రాష్ట్రంలోని అంతులేని ఘోర అవమానం ఆయనకు ఎదురైంది. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లాలో జాతిపిత గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. అమ్రేలి జిల్లాలోని హరికృష్ణ సరస్సు వద్ద ఓ గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం ముక్కలు ముక్కలై కిందపడి ఉండడం చూసి అందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో గల డైమండ్ మర్చంట్ సావ్ జీ భాయి ధోలకియా ఆధ్వర్యంలో ఈ గాంధీజి విగ్రహాన్ని 2017లో ఏర్పాటు చేశారు. 2018లో స్వయంగా ఈ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించడం విశేషం. మోడీ ఆవిష్కరించిన విగ్రహమే ఇలా ముక్కలై పోవడం కలకలం రేపింది.

హరికృష్ణ సరస్సు వద్ద చేపడుతున్న నిర్మాణాలను వ్యతిరేకిస్తున్న సంఘ వ్యతిరేక శక్తులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.