Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్ .. ఏపీలో 70 శాతం మందిలో యాంటీబాడీలు !

By:  Tupaki Desk   |   31 July 2021 6:47 AM GMT
గుడ్ న్యూస్ .. ఏపీలో  70 శాతం మందిలో యాంటీబాడీలు !
X
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న 70 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన నాలుగో సెరో సర్వేలో తేలింది. టీకాలు తీసుకోని 59.5 శాతం మందిలోనూ యాంటీబాడీలు పెరిగినట్టు వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 63.5 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 56.38 శాతంగా ఉంది. ఇక టీకాలు రెండు డోసులు తీసుకున్న వారిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, అంగన్‌ వాడీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖ ఉద్యోగులు ఉన్నారు.  రాష్ట్ర ప్రజల్లో 70శాతం మందికి యాంటీబాడీలు డెవలప్ అయనట్లు తెలిసింది.

21రాష్ట్రాల్లోని 70జిల్లాల్లో జూన్ 14 నుంచి జులై 6 మధ్య సర్వే నిర్వహించారు. కృష్ణా, నెల్లూర్, విజయనగరాలలో సర్వే జరిగింది. దేశమొత్తంలో మధ్య ప్రదేవ్ 79శాతం యాంటీబాడీలతో టాప్ లో ఉండగా ఆ తర్వాత కేరళ 44.4శాతం యాంటీబాడీలతో చివరి స్థానంలో ఉంది. యాంటీబాడీల స్థాయిపై నిర్వహించిన సర్వేలో ఇండియా సగటు 67శాతం. రాష్ట్రవ్యాప్తంగా 12వందల 60 బ్లడ్ శాంపుల్స్ సేకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటె .. ఆంధ్రప్రదేశ్‌ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,068 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2,127 మంది బాధితులు చికిత్సకు కోలుకున్నారు. మరో 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 19,64,117 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 19,29,565 కోలుకున్నట్లు తెలిపింది. మొత్తం 21,198 యాక్టివ్‌ కేసులున్నాయి. మృతుల సంఖ్య 13,354కు పెరిగినట్లు పేర్కొంది.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఆగస్టు 14 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు.