Begin typing your search above and press return to search.

ఆ ఫేస్‌బుక్ పోస్టు న‌ర‌బ‌లి గురించేనా?

By:  Tupaki Desk   |   15 Oct 2022 1:30 AM GMT
ఆ ఫేస్‌బుక్ పోస్టు న‌ర‌బ‌లి గురించేనా?
X
కేర‌ళ‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను న‌ర‌బ‌లి ఇచ్చిన కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. త‌వ్వే కొద్దీ పోలీసుల విచార‌ణ‌లో కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొల‌గ‌డానికి, అధిక సంపాద‌న‌కు మూఢ విశ్వాసాల‌తో దంప‌తులు, ఒక మాంత్రికుడితో క‌లిసి ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను ఖండ‌ఖండాలుగా న‌రికి బ‌లి ఇచ్చిన సంగ‌త‌వి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో దంప‌తుల‌తోపాటు మాంత్రికుడిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. విచార‌ణ‌లో నిందితులు పోలీసులు అనేక సంచ‌లన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

కేరళలోని పథనంతిట్ట జిల్లా ఎలంతూర్‌లో భ‌గ‌వ‌ల్ సింగ్, లైలా దంప‌తులు ఉన్నారు. న‌ర‌బ‌లి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొల‌గి సంప‌ద చేకూరుతుంద‌ని వారికి మాంత్రికుడు ర‌షీద్ అలియాస్ మ‌హ్మ‌ద్ ష‌పీ చెప్పాడు.

అంతేకాకుండా త‌న‌కు ప‌రిచ‌య‌మున్న‌ వీధుల్లో లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే పద్మ (52)ను, రోస్లిన్‌(50)ను రషీద్‌ ఎలంతూర్‌లో భగవల్‌ సింగ్‌ దంపతుల నివాసానికి తీసుకువచ్చాడు. ఈ మ‌హిళ‌లిద్ద‌రూ ర‌షీద్‌కు ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ ద్వారా ప‌రిచ‌య‌మ‌య్యారు. గ‌తంలో 75 మ‌హిళ‌పై అత్యాచారం చేసి ర‌షీద్ జైలుకెళ్లాడు. ప్ర‌స్తుతం ఆ కేసులో బెయిల్ పై ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో త‌న శృంగార వాంఛ‌ను తీర్చుకోవ‌డానికి తనతో శృంగారంలో పాల్గొంటే రూ.15 వేలు ఇస్తానని, నీలి చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తానని ప‌ద్మ‌, రోస్లిన్‌ల‌ను బుట్టలో వేసుకున్నాడు.

వీరిని ఎలంతూరులోని భ‌గ‌వ‌ల్ సింగ్ నివాసానికి తీసుకొచ్చిన రషీద్ దంప‌తుల‌తో క‌లిసి వారిని న‌ర‌బ‌లి ఇచ్చాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌హిళ‌ల రొమ్ముల‌ను సైతం క‌త్తిరించాడు. ర‌క్తం ప్ర‌వ‌హిస్తే మంచి జ‌రుగుతుంద‌ని ఇలా రొమ్ములు కోశాడు. ఆ త‌ర్వాత ప‌ద్మ‌ను ఐదు ముక్కలుగా, రోస్లిన్‌ను 56 ముక్కలుగా చేశాడు. ఆ త‌ర్వాత భ‌గ‌వ‌ల్ సింగ్, అత‌డి భార్య‌, మాంత్రికుడు ర‌షీద్ మృతుల శ‌రీర భాగాల‌ను వండుకుని భుజించారు.

ఈ క్ర‌మంలో మాంత్రికుడు ర‌షీద్.. భ‌గ‌వ‌ల్ సింగ్ భార్య‌తో అత‌డి ముందే శృంగారం చేశాడ‌ని షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. భ‌ర్త అనుమ‌తితోనే ర‌షీద్ ఇలా చేశాడ‌ని వెల్ల‌డ‌య్యింది.

కాగా ఈ కేసులో భ‌గ‌వ‌ల్ సింగ్‌, అత‌డి భార్య లైలా, మాంత్రికుడు ర‌షీద్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా భగవల్‌ సింగ్‌.. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను న‌ర‌బ‌లి ఇచ్చాక‌ ఫేస్‌బుక్‌లో కవిత రూపంలో ఓ నిగూఢ పోస్ట్‌ పెట్టాడ‌ని చెబుతున్నారు. నరబలిని ఉద్దేశిస్తూనే ఆ పోస్ట్‌ పెట్టినట్లు పేర్కొంటున్నారు.

కాగా ఇద్ద‌రు మ‌హిళ‌లను అత్యంత కిరాత‌కంగా న‌ర‌బ‌లి ఇచ్చి భగవల్ సింగ్‌ దంపతులు అరెస్టయ్యారని తెలియగానే ఎలంతూర్‌ గ్రామస్థులు షాక్‌కు గుర‌య్యారు. ఈ దారుణాన్ని ఇంకా వారు న‌మ్మ‌లేకున్నారు. ఎందుకంటే స్థానికంగా వీరికి ఎంతో మంచి పేరుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. 60 ఏళ్ల భగవల్‌ సింగ్‌ది ఉన్న‌త విద్యావంతుల కుటుంబమ‌ని చెబుతున్నారు.

భ‌గ‌వ‌ల్ సింగ్‌ తాతముత్తాతలు సంప్రదాయ ఆయుర్వేద వైద్యుల‌ని... ఆ రోజుల్లోనే ఆస్ప‌త్రుల‌కు కూడా వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ఎంతోమంది రోగాల‌ను న‌యం చేశార‌ని పేరు తెచ్చుకున్నారు. త‌న తాత‌ముత్తాత‌ల బాట‌లోనే భగవల్‌ సింగ్‌ కూడా న‌డిచాడు. దీంతో పాటు సామాజిక కార్యకర్తగానూ వ్యవహరిస్తున్నాడు. భగవల్‌ దంపతులు ఎంతో మర్యాదస్తులని, ఎప్పుడూ ఎవరితోనూ గొడవలు పెట్టుకునేవారు కాదని స్థానికులు చెబుతుండ‌టం విశేషం.

అంతేకాకుండా భగవల్‌కు కవిత్వం అంటే చాలా ఇష్టమ‌ని తెలుస్తోంది. ఫేస్‌బుక్‌లో చురుగ్గా ఉండే ఆయ‌న‌ తరచూ తన కవితలను అందులో పోస్ట్ చేస్తుంటాడు. జపనీస్‌ కవిత్వానికి చెందిన ‘హైకూ’ ను కూడా నేర్చుకుంటున్నట్లు భ‌గ‌వ‌ల్ సింగ్ పోస్టు పెట్ట‌డం గ‌మ‌నార్హం.

న‌ర‌బ‌లిలో భాగంగా ప‌ద్మ‌ను కిరాత‌కంగా హ‌త్య చేశాక అక్టోబరు 6న భగవల్ సింగ్‌ ఓ కవితను ఫేస్‌బుకులో పోస్ట్‌ చేశాడు. మలయాళంలో ఉన్న ఆ కవితకు.. ‘‘నిప్పుల కొలిమిపై ఆమె శరీరం వంగి ఉంది’’ అని అర్థం అని తెలుస్తోంది. నరబలి నేప‌థ్యంలోనే భ‌గ‌వ‌ల్ సింగ్‌ ఈ పోస్ట్‌ను చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కాగా భగవల్‌కు లైలా రెండో భార్య. అతడికి మొదటి భార్యతో ఓ కుమార్తె, కుమారుడు ఉండగా.. ప్రస్తుతం వారు విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మ‌రోవైపు ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను ముక్క‌లు ముక్కులుగా న‌రికి చంపిన త‌ర్వాత‌ భగవల్‌ దంపతులు, మాంత్రికుడు మహిళల శరీర భాగాల్లో కొన్నింటిని వండుకుని తిన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను భగవల్‌ దంపతులు తిరస్కరించ‌డం గ‌మ‌నార్హం. దర్యాప్తు సంస్థలు కావాలనే ఇలాంటి తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని భగవల్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అధికారులే మాంత్రికుడి చేత‌ బలవంతంగా ఇలా చెప్పించారని న్యాయ‌వాది అంటున్నారు. పోలీసులు కూడా ఈ విష‌యాన్ని అంగీక‌రించారు. దంప‌తులు.. మ‌హిళ‌ల శ‌రీర భాగాల‌ను వండుకు తిన‌డానికి సంబంధించి ఏ ఆధారాలు దొర‌క‌లేద‌ని తెలిపారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.