Begin typing your search above and press return to search.

భార్య‌పై అనుమానం.. 'మానం'లోకి క‌ర్ర‌ తోసి చంపేశాడు!

By:  Tupaki Desk   |   24 Dec 2022 2:30 AM GMT
భార్య‌పై అనుమానం.. మానంలోకి క‌ర్ర‌ తోసి చంపేశాడు!
X
అనుమానం పెను భూతం అంటారు క‌దా! అయితే.. ఎంత అనుమానం ఉంటే మాత్రం భార్య‌ను చంపేయా ల‌ని లేదు!! ఆమెకు దూరంగా ఉండొచ్చు.. చ‌ట్ట రీత్యా విడాకులు సైతం తీసుకోవ‌చ్చు. కానీ, ఓ భ‌ర్త మృగంగా మారిపోయాడు. భార్యపై అనుమానంతో ఊగిపోయాడు. విచ‌క్ష‌ణ మ‌రిచిపోయాడు. అత్యంత కిరాత‌కంగా.. చంపేశాడు.

భార్య మానంలోకి కర్ర తోసేసి.. గిర్రున తిప్పేసి.. హత్య చేశాడు. ఆ తర్వాత అతను సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్లోని మాడా జిల్లా ప‌రిధిలోని కుమ్హియా గ్రామానికి చెందిన‌ ఓ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఓ వ్యక్తికి తన భార్యపై అనుమానం వచ్చింది. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానించిన అతడు.. గురువారం ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది.

నేను అలాంటి దాన్ని కాదు మొర్రో! అని స‌ద‌రు బాధ్య చెప్పినా విన‌కుండా.. విచక్షణ కోల్పోయిన భ‌ర్త‌.. తన భార్య మానంలోకి పొడ‌వాటి రూళ్ల కర్రను తోసేశాడు. అంతేకాదు.. రెండు మూడు సార్లు క‌ర్ర‌ను బ‌లంగా తిప్పేశాడు.

దీంతో తీవ్ర ర‌క్త స్రావ‌మైన ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.