Begin typing your search above and press return to search.

వైరస్ టెస్టులపై కీలక మార్గదర్శకాలు వెల్లడించిన ఐసీఎంఆర్

By:  Tupaki Desk   |   25 Jun 2020 8:10 AM
వైరస్ టెస్టులపై కీలక మార్గదర్శకాలు వెల్లడించిన ఐసీఎంఆర్
X
దేశంలో రోజు రోజుకి వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి మార్గదర్శకాలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) మంగళవారం కీలక మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ వైరస్ అనుమానిత లక్షణాలున్నవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ప్రయివేట్ హాస్పిటల్స్, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ విభాగాల్లోనూ యాంటీబాడీ పరీక్షలను చేపట్టాలని తెలిపింది.

ఈ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఎవరికి చేయాలనే దాని పై సవరించిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ జారీ చేసింది. పరిస్థితిని బట్టి ఇప్పటివరకూ ఆరు దశలుగా మార్గదర్శకాలు ఇచ్చిన ఐసీఎంఆర్‌ మంగళవారం మరోసారి సవరించిన గైడ్ ‌లైన్స్‌ ను వెలువరించింది. మే నెలలో వెలువరించిన మార్గ దర్శకాల్లో భాగంగా 8 రకాల కేటగిరీల వాళ్ల కు విధిగా ఆర్‌ టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలని, అన్ని రాష్ట్రాలు ఈ మార్గ దర్శకాలను అనుసరించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ‘

తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నవారు. ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించక పోయినా హై రిస్క్‌ పాజిటివ్‌ కేసుల తో సంబంధం ఉన్న వారు లేదా టెస్టు చేసిన తర్వాత వైరస్ గా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్‌ అయినవారు. హాట్ ‌స్పాట్లు, కంటైన్మెంట్‌ జోన్లలో వైరస్‌ లక్షణాలున్న అందరికీ. ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందుతూ ఐఎల్‌ ఐ లక్షణాలు కనిపించిన వారికి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి లో జ్వరం లేదా జలుబు లక్షణాలున్నా... ఐఎల్ ‌ఐ లక్షణాలు కనిపించిన వారికి. కరోనా నిర్ధారణ పరీక్ష చేయలేదన్న కారణంతో ప్రసవాలు లాంటి అత్యవసర సేవలను వాయిదా వేయరాదని సూచించింది. జూన్ 15న ఐసిఎంఆర్ కంటెయిన్‌ మెంట్ జోన్లు, హెల్త్‌ కేర్ సెట్టింగుల కోసం కొత్త ఆన్-సైట్ డయాగ్నొస్టిక్ కిట్‌ను ఆమోదించింది. ల్యాబొరేటరీ అవసరం లేకుండా వేగంగా, తక్కువ ఖర్చుతో ఫలితాలు వస్తాయి.