Begin typing your search above and press return to search.

మన ఆయుర్ధాయం ఎన్ని ఏళ్లు పెరిగిందో తెలుసా?

By:  Tupaki Desk   |   17 Oct 2020 8:00 AM IST
మన ఆయుర్ధాయం ఎన్ని ఏళ్లు పెరిగిందో తెలుసా?
X
ప్రతీఒక్కరికి నిత్యయవ్వనంతో ఎక్కువ కాలం జీవించాలని ఉంటుంది. కానీ మారుతున్న పరిస్థితుల్లో రోజురోజుకు మానవుడి సగటు ఆయుర్దాయం తగ్గుతూ పోతుంది. శాస్త్రవేత్తలు మానవుడి ఆయుర్ధాన్ని పెంచేందుకు ఎన్నోరకాల పరిశోధనలు చేస్తున్నారు. వీటిలో కొన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయి.

అయితే రోజురోజుకు పుట్టుకొస్తున్న కొత్త రోగాలు.. పెరుగుతున్న కాలుష్యంతో సగటు మనిషి ఆయుర్ధాయం మాత్రం తగ్గుందన్నది వాస్తవం. కాగా కొన్ని దేశాల్లో మాత్రం సగటు ఆయుర్ధాయం 80కిపై మాటే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రపంచంలో ఆయుర్థాయం 90ఏళ్లు సగటు ఉన్న తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డు సృష్టించింది. ఈ దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఆదర్శంగా నిలుస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇక్కడి ప్రజలకు తక్కువ రక్త పోటు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఉన్నాయి.

ఇక భారత్ విషయానికి వస్తే.. భారతీయుల సగటు ఆయుష్సుకు సంబంధించి తాజాగా ‘లాన్సెట్ జర్నల్’ ఓ నివేదికను ప్రచురించింది. 1990లో భారతీయుల సగటు జీవిత కాలం 59.6 ఏళ్లు ఉండగా.. అది 2019 నాటికి వైద్య సదుపాయాలు, పౌష్టికాహారంపై ప్రాధాన్యత పెరిగి 70.8 ఏళ్లకు చేరింది.

30 ఏళ్ల కాలంలో భారతీయుడి సగటు ఆయుష్షు కాలం పదేళ్లు పెరిగినా.. భారత్ లో మాత్రం పలు రాష్ట్రాల మధ్య తేడాలు ఉన్నట్లు లాన్సెట్ వెల్లడించింది.

ముఖ్యంగా దేశంలోనే అత్యధిక అక్షరాస్యత గల కేరళ రాష్ట్రంలో సగటు ఆయుష్సు జీవితాకం 77.3 ఏళ్లకు చేరుకుంది. ఇక అత్యంత తక్కువగా ఉత్తరప్రదేశ్ లో మనిషి జీవితకాలం 66.9 ఏళ్లకు చేరినట్లు నివేదిక వెల్లడించింది.