Begin typing your search above and press return to search.

ఆ దేశాలకు విమానాలు నిలిపివేత

By:  Tupaki Desk   |   15 March 2020 10:09 AM GMT
ఆ దేశాలకు విమానాలు నిలిపివేత
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం మొదలైంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వివిధ దేశాలకు విస్తరిస్తోంది. ఇటలీ, ఇరాన్ లాంటి దేశాల్లో మరణ మృదంగం వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 5800 దాటింది.

ఇప్పటికే భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా పలు దేశాలకు విమాన రాకపోకలు బంద్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వరకు ఆయా దేశాలకు ఏకంగా విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులకు షాకింగ్ మారింది. ‘కరోనా వైరస్’ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్న ఇటలీ - ఫ్రాన్స్ - సౌత్ కొరియా - కువైట్ - మాడ్రిడ్ - కొలొంబో దేశాలు - నగరాలకు విమానాలను రద్దు చేస్తూ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా నిర్ణయించింది.

ఈ దేశాలు ప్రాంతాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇక్కడి నుంచి వచ్చిన వారే భారత్ లో కరోనా వ్యాప్తికి కారణమయ్యారని కేంద్రం గుర్తించింది. అది మరింత ముదరకుండా ఉండాలంటే వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

ఎయిర్ ఇండియా బాటలోనే మరో ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ నడిచింది. ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 17వ తేదీ నుంచి తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. షార్జా - అబుదాబి - దుబాయ్ వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది.