Begin typing your search above and press return to search.

ఐపీఎల్ కొనుగోళ్లు.. తొలి రోజు ఎంత పెట్టి కొన్నారంటే

By:  Tupaki Desk   |   20 Dec 2019 4:57 AM GMT
ఐపీఎల్ కొనుగోళ్లు.. తొలి రోజు ఎంత పెట్టి కొన్నారంటే
X
ఐపీఎల్ సీజన్ మొదలు కావటానికి కొన్ని నెలల ముందే దానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు బోలెడన్ని వరుస పెడుతుంటాయి. ఐపీఎల్ నిర్వహించేందుకు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవటం కోసం నిర్వహించే వేలం చాలా ఆసక్తికరంగా మారుతుంటుంది. ఈ వేలంతో చాలామంది ఆటగాళ్ల తలరాతలు మారటమే కాదు.. కొందరికి కొత్త ఫేమ్ వచ్చేస్తుంటుంది. ఊహించని రీతిలో పలికే ధరలతో వారి ఇమేజ్ ఒక్కసారిగా మారుతుంటుంది.

కొత్త ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ.. తొలి రోజు (గురువారం) నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో పలు ఫ్రాంచైజీలు కొనుగోళ్లు చేపట్టారు. మొత్తం 62 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఏ జట్టు ఎంతమంది ఆటగాళ్లను ఎంత ధరకు కొనుగోలు చేశారు? ఇప్పుడా ఫ్రాంచైజీల వద్ద మిగిలిన మొత్తం ఎంత? అన్నది చూస్తే..

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)
మిగిలిన మొత్తం రూ. 15 లక్షలు. ఇద్దరు దేశవాళీ, ఒక విదేశీ ఆటగాడి కోసం స్లాట్లు మిగిలున్నాయి.
కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
పీయూష్ చావ్లా: రూ.6.75 కోట్లు
శామ్ కరన్: రూ.5.5 కోట్లు
జోష్ హాజిల్‌వుడ్: రూ.2.కోట్లు
సాయి కిషోర్: రూ.20 లక్షలు

ముంబై ఇండియన్స్
మిగిలిన మొత్తం రూ.1.95 కోట్లు. ఒక దేశవాళీ ఆటగాడి స్థానం మిగిలి ఉంది
కొనుగోలు చేసిన ఆటగాళ్లు
నాథన్ కల్టర్ నైల్: రూ.8 కోట్లు
క్రిస్ లిన్: రూ.2 కోట్లు
సౌరభ్ తివారీ: రూ.50 లక్షలు
మోసిన్ ఖాన్: రూ.20 లక్షలు
తర్జిందర్ ధిల్లాన్: రూ.20 లక్షలు
దిగ్విజయ్ దేశ్‌ముఖ్: రూ.20 లక్షలు

ఢిల్లీ కేపిటల్స్
మిగిలిన మొత్తం రూ.9 కోట్లు. మూడు దేశవాళీ ఆటగాళ్ల స్లాట్లు మిగిలి ఉన్నాయి.
కొనుగోలు చేసిన ఆటగాళ్లు
షిమ్రన్ హెట్మెయిర్: రూ.7.75 కోట్లు
మార్కస్ స్టోయినిస్: రూ.4.8 కోట్లు
అలెక్స్ కేరీ: రూ.2.4 కోట్లు
జాసన్ రాయ్: రూ.1.5 కోట్లు
క్రిస్ వోక్స్: రూ.1.5 కోట్లు
మోహిత్ శర్మ: రూ.50 లక్షలు
తుషార్ దేశ్‌పాండే: రూ.20 లక్షలు