Begin typing your search above and press return to search.

ముస్లింలందరినీ బండి భయపెడుతున్నారా ?

By:  Tupaki Desk   |   15 April 2022 3:28 AM GMT
ముస్లింలందరినీ బండి భయపెడుతున్నారా ?
X
బీజేపీ చీఫ్ బండి సంజయ్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. రెండోవిడత పాదయాత్రను జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభించిన బండి మాట్లాడుతు అక్బరుద్దీన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటు వార్నింగ్ ఇచ్చారు. అప్పుడెప్పుడో అంటే సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ మాట్లాడుతు హిందువులను రెచ్చగొట్టే స్పీచిచ్చారు. దాంతో అ సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అక్బరుద్దీన్ పై హేట్ స్పీచ్ అనే కేసు నమోదైంది.

ఆ కేసు తాలూకు కోర్టు విచారణలో అక్బర్ కు క్లీన్ చిట్ వచ్చింది. ఇదే విషయమై బండి మాట్లాడుతు బీజేపీ అధికారంలోకి వస్తుందని తాము అధికారంలోకి రాగానే అక్బర్ ను వదిలే ప్రసక్తే లేదంటు వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. నిజానికి అప్పట్లో అక్బర్ మాట్లాడిన మాటలకు ఇపుడు బండికీ సంబంధమే లేదు. ఎన్నో సంత్సతరాల క్రితం అక్బర్ చేసిన వ్యాఖ్యలపై ఇఫుడు బండి స్పందించాల్సిన అవసరమేలేదు.

అక్బర్ వ్యాఖ్యలను పోలీసులు, కోర్టులు చూసుకుంటాయి. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని బండి వార్నింగ్ ఇవ్వటమంటే యావత్ ముస్లింలను రెచ్చగొట్టడం తప్ప వేరొకటికాదు. ఎందుకంటే ఎంఐఎంకు బాగా పట్టున్న ప్రాంతం ఓల్డ్ సిటీ మాత్రమే.

ఓల్డ్ సిటిలో ఓవైసీ సోదరులు ఏమి చెబితే అదే వేదవాక్కు ముస్లింల్లో చాలామందికి. ఇలాంటి నేపధ్యంలో అక్బర్ కు వార్నింగ్ ఇవ్వటమంటే ముస్లింలను రెచ్చగొట్టడమే తప్ప మరొకటికాదు.

అక్బర్ పైన ఏదన్నా యాక్షన్ తీసుకోదలచుకుంటే తీసుకోవచ్చు. అయినా బీజేపీ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు ? వస్తుందనే భ్రమలో వీళ్ళున్నారు కానీ వచ్చేస్తుందనే నమ్మకం చాలామందిలో లేదు. ఒకవేళ అధికారంలోకి వచ్చేదే నిజమైనా వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటే అది వేరే విదంగా ఉంటుంది.

అంతేకానీ ఇప్పటినుండే అక్బర్ ను కేంద్రంగా చేసుకుని ముస్లింలందరికీ వార్నింగ్ ఇచ్చి నానా గోల చేయాల్సిన అవసరమే లేదు. బీజేపీ అదికారంలోకి వస్తే ఏమి జరుగుతుందో అనే భయం ముస్లింలందరిలోను కల్పించి వాళ్ళలో లేనిపోని భయాలను రేకెత్తించటం తప్ప ఇపుడు బండి చేయగలిగేదేమీ లేదని గ్రహించాలి.