Begin typing your search above and press return to search.

మసీదుకు రాలేదని కాల్చేశారు

By:  Tupaki Desk   |   19 Feb 2016 8:39 AM GMT
మసీదుకు రాలేదని కాల్చేశారు
X
రాక్షస మూక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి ప్రపంచాన్ని భయభ్రాంతులను చేశారు. పాప్ సంగీతం విన్నాడని ఇటీవలే ఓ యువకుడి తల నరికిన ఉగ్రవాదులు తాజాగా మరో ఇద్దరిని కాల్చి చంపేశారు. అందుకు కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.... మసీదులో ప్రార్థనకు రాలేదన్న కారణంతో వారిని కాల్చేశారు. యువకుడి తల నరికిన మోసుల్ లోనే ఈ దారుణమూ చోటుచేసుకుంది. మోసూల్ లో ఇద్దరు యువకులు అక్కడి మసీదులో ప్రార్థనలకు రాలేదట... దాంతో ఉగ్రవాదులు వారిని ఎత్తుకెళ్లి తొలుత నిర్బంధించారు. అనంతరం వారిని అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ తన్నుతూ చివరకు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీ పెట్టి దారుణంగా కాల్చిచంపేశారు. ఇదంతా వీడియో చిత్రీకరించి ఇంటర్నెట్ లో పెట్టారు.

అంతకుముందు ఇదే మోసుల్ లో అయాం హుస్సేన్ (15) అనే బాలుడు తన తండ్రికి చెందిన దుకాణంలో కూర్చుని పాటలు వింటుండడంతో పెట్రోలింగ్ చేస్తున్న ఉగ్రవాదులు ఆ దృశ్యం చూసి ఆ కుర్రాడిని ఎత్తుకెళ్లి బహిరంగంగా తల నరికేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా... ప్రపంచ దేశాలు వారిపై యుద్ధం ప్రకటించినా కూడా ఏమాత్రం భయం లేకుండా తమ దారుణాలు కొనసాగిస్తున్నారు ఐఎస్ ఉగ్రవాదులు.