Begin typing your search above and press return to search.

ఐటీ దాడుల కొన‌సాగింపు..టీడీపీ ఎమ్మెల్సీ కంపెనీల‌పై దాడి

By:  Tupaki Desk   |   8 Dec 2018 1:32 PM GMT
ఐటీ దాడుల కొన‌సాగింపు..టీడీపీ ఎమ్మెల్సీ కంపెనీల‌పై దాడి
X
ఐటీ దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. నెల్లూరులో ఒంగోలు మాజీ ఎంపీ - టీడీపీ నేత - ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిప కంపెనీలపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు... మాగుంట కుటుంబానికి చెందిన కంపెనీలపై నిన్నటి నుంచి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి... చెన్నై టి.నగర్ లోని కార్పొరేట్ కార్యాలయంతో పాటు పూనమల్లి రోడ్ లోని ఫ్యాక్టరీపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం సంచ‌లనంగా మారింది. ఐటీ అధికారులు లెక్కకురాని 55 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇక చెన్నైలో నెల్లూరుకు చెందినవారికి సంబంధించిన సవేరా హోటల్ లోని ప్రైవేట్ లాకర్లలో పెద్ద ఎత్తున బంగారం - నగదు నిల్వలు దాచిపెట్టినట్టు ఐటీ అధికారులకు సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరుకు చెందిన కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆ హోటల్ లోని ప్రైవేట్ లాకర్లలో డబ్బు - బంగారం భద్రపరిచారని భావిస్తున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారుల దాడుల్లో మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మాగుంట - సవేరా హోటళ్లు కార్యాలయాలపై దాడులతో జిల్లాలోని పలువురు సంపన్నుల్లో గుబులు పట్టుకుంది.