Begin typing your search above and press return to search.

జగన్ బెయిల్ రద్దు: కోర్టు ఏం తేల్చిందంటే?

By:  Tupaki Desk   |   14 July 2021 7:00 PM IST
జగన్ బెయిల్ రద్దు: కోర్టు ఏం తేల్చిందంటే?
X
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టులో బుధవారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించకపోవడాన్ని కోర్టు దృష్టికి పిటీషనర్ తీసుకొచ్చారు. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజులు గడువును సీబీఐ కోరింది.

ఇక ఇప్పటికే సీబీఐ అధికారులకు రెండు దఫాలు అవకాశం ఇచ్చారని.. ఇప్పుడు మరో అవకాశం ఇవ్వొద్దని కోర్టును పిటీషన్ కోరారు. ఇక సీబీఐ దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇస్తామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను 26కు వాయిదావేసింది.

జగన్ పై ఉన్న కేసుల్లో సాక్షులు, నిందితులుగా ఉన్న అధికారులు ప్రస్తుతం ఏపీలో కీలక హోదాలో పనిచేస్తున్నారని.. ఏపీ సీఎం సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందని లిఖిత పూర్వక వాదనల్లో పిటీషన్ తెలిపారు.

ఐఏఎస్, ఐపీఎస్ ల ట్రాక్ రికార్డ్ చూడాల్సిన బాధ్యత సీఎస్ పరిధిలో ఉంటుందని.. కానీ ప్రత్యేక జీవో ద్వారా సీఎం జగన్ ఆ అధికారులను బదిలీ చేసుకున్నారన్నారు. దీంతో సాక్షులుగా ఉన్న అధికారులను పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. ముమ్మాటికీ ఏపీ సీఎంగా ఉన్న జగన్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించారన్నారు.

తాజాగా కోర్టు చెప్పిన దాని ప్రకారం సీబీఐ ఈసారి తప్పక లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సీబీఐ అనేది దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇచ్చామని తెలిపారు.ఇక సీబీఐ ఈనెల 26వ తేదీన లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానం బట్టి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది స్పష్టత రావాల్సి ఉంటుంది.