Begin typing your search above and press return to search.

భస్మాసురుడు..బాబు సేమ్ టు సేమ్:జగన్

By:  Tupaki Desk   |   9 July 2017 6:18 PM IST
భస్మాసురుడు..బాబు సేమ్ టు సేమ్:జగన్
X
చంద్రబాబు పాలనపై సమరశంఖం పూరించామని, ఆయన గుండెల్లో ఈపాటికే రైళ్లు పరిగెత్తి ఉంటాయని జగన్ అన్నారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబుకు, ప్రజలు ఓ లెక్కా? .. వారిని మోసం చేస్తారంటూ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును భస్మాసురుడితో పోల్చారు. భస్మాసురుడు.. చంద్రబాబు ఒక్కరేనంటూ జగన్ విరుచుకుపడ్డారు. 2014లో తాను మారిపోయానని చంద్రబాబు అన్నారని, మూడేళ్లుగా ప్రజల నెత్తిన చెయ్యి పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని, ఆయన అంత అవినీతిపరుడు దేశంలో ఎక్కడా లేడని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ను దేశంలో అవినీతి రాష్ర్టంగా మార్చేసింది చంద్రబాబేనని... ఏపీని అవినీతిలో నంబర్ 1 చేసి చెడ్డపేరు తెచ్చారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు తీరుస్తామని చెప్పారు.