Begin typing your search above and press return to search.

ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   29 Dec 2020 3:40 PM IST
ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
X
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2021 సంవత్సరంలో కొలువుల జాతర ఉండనుందని తెలిపింది. మూడు డీఎస్సీ ఎంట్రన్స్ లు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది.

ఏపీలో స్పెషల్ డీఎస్సీ, లిమిటెడ్ డీఎస్సీ, రెగ్యులర్ డీఎస్సీ పేరిట నోటిఫికేషన్లను జారీ చేయనుంది. గత డీఎస్సీలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరిలో లిమిటెడ్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇక దీని తర్వాత దివ్యాంగ విద్యార్థులకు బోధించేందుకు స్పెషల్ బీఈడీ చేసిన వారి కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించనున్నారు. ఈ రెండు డీఎస్సీలకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది.

ఇక ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యిందని తెలుస్తోంది. ఇక టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తర్వాత రెగ్యులర్ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది.

ఇటీవల ఎస్ఈఆర్టీ టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.