Begin typing your search above and press return to search.

జనసేన తరఫు మాట్లాడే మీడియా ప్రతినిధులు వీరే..!

By:  Tupaki Desk   |   9 July 2015 4:21 AM
జనసేన తరఫు మాట్లాడే మీడియా ప్రతినిధులు వీరే..!
X
రాజకీయ పార్టీ పెట్టినట్లు ప్రకటించినప్పటికీ ఒక రాజకీయ పార్టీకి ఏమేం అవసరం అన్న విషయంపై ఇప్పటివరకూ పెద్దగా దృష్టి పెట్టని పవన్‌కల్యాణ్‌.. ఇప్పుడు అలాంటి అంశాలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

తాజాగా ఆయన ఆంధ్రా.. తెలంగాణలకు సంబంధించిన అంశాలపై పార్టీ తరఫున ప్రకటనలు చేయటానికి.. తన వాదనను వినిపించటానికి నలుగురితో కూడిన పార్టీ సమన్వయకర్తల్ని మీడియాకు పరిచయం చేసింది.

వీరిలో.. బింగునూరి మహేందర్‌రెడ్డి.. రియాజ్‌.. నర్సింహా.. శంకర్‌గౌడ్‌లు ఉన్నారు. పార్టీ సమనర్వయకర్తల్ని చూసినప్పుడు పవన్‌ అత్యంత వ్యూహాత్మకంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒసీ.. బీసీ.. మైనార్టీలకు చెందిన వారిని నియమించటంతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని నియమించటం చూసినప్పుడు.. పవన్‌ అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న స్పష్టం అవుతుంది. అంతేకాదు.. పార్టీకి సంబంధించిన వాదనల్ని తరచూ వినిపించటానికి వీలుగా ఈ నియమాకం జరిగినట్లుగా కనిపిస్తోంది.