Begin typing your search above and press return to search.

మ‌ద్య నిషేధం అంటే.. 22 వేల కోట్లు పిండేయ‌డ‌మా? వైసీపీపై జ‌న‌సేన ఫైర్‌

By:  Tupaki Desk   |   12 Jun 2022 1:30 AM GMT
మ‌ద్య నిషేధం అంటే.. 22 వేల కోట్లు పిండేయ‌డ‌మా?  వైసీపీపై జ‌న‌సేన ఫైర్‌
X
మద్యం ఆదాయంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. మద్యపాన నిషేధమంటే మద్యం ఆదాయం రూ.22 వేల కోట్లకు పెంచటమా? అని ప్రశ్నించారు. 'స్పిరిటెడ్ విజనరీ' జగన్ మేనిఫెస్టో అమలు తీరు ఇదేనని ఎద్దేవా చేశారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచటమా? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మద్యంపై వచ్చే ఆదాయం గతంలో కంటే భారీగా పెరిగిన విషయాన్ని మనోహర్ ట్వీట్ చేశారు. మద్యం ద్వారా వచ్చిన రాబడిని చూపించి రూ.8 వేల కోట్ల ప్రభుత్వ బాండ్లు అమ్ముతున్నారని ఆరోపించారు.

వైఎస్ జగన్ 'స్పిరిటెడ్ విజనరీ' మేనిఫెస్టో అమలు ఇదేనా? అంటూ చురకలంటించారు. మద్యం ద్వారా అధిక ఆదాయం సంపాదించటంతోపాటు అప్పు కూడా పొంది జాక్పాట్ కొట్టారని నాదెండ్ల ఎద్దేవా చేశారు.

కాగా, ఇదే విష‌యంపై గ‌త కొన్నాళ్లుగా ప్ర‌తిప‌క్షాలు కూడా ప్ర‌శ్న‌లు సంధిస్తున్నాయి. 2019 ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌.. తానుఅ ధికారంలోకి వ‌స్తే.. మ‌ద్య నిషేధం విడ‌తల వారీ చేస్తాన‌ని.. 2024 నాటికి పూర్తిస్థాయిలో మ‌ద్యాన్ని నియం త్రిస్తాన‌ని చెప్పారు.

కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు.. మ‌ద్య నిషేధంపై మాట మారుస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నిషేధం అన్న మాట అటుంచితే.. వ‌చ్చే మూడేళ్ల‌పాటు అమ్మ‌కాల‌ను చూపించి మ‌రీ.. అప్పులు చేస్తున్నారు. దీనిపైనే ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. తాజాగా జాతీయ మీడియాలోనూ దీనిపై క‌థ‌నాలు వ‌చ్చాయి. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.