Begin typing your search above and press return to search.

పాల్‌ మళ్లీ ఏసేశాడు

By:  Tupaki Desk   |   18 Jan 2019 12:23 PM IST
పాల్‌ మళ్లీ ఏసేశాడు
X
రాజకీయాల్లో స్టార్‌ కమెడీయన్‌ కేఏ పాల్‌ మళ్లీ వచ్చేశాడు. వచ్చీ రావడంతోనే పొట్ట చెక్కలయ్యేలా కామెడీ చేసి సైలెంట్‌ గా వెళ్లిపోయాడు. అయితే.. గతంలో వచ్చినప్పటికి - ఇప్పటికి చేసే కామెడీలో తేడా ఉండాలని సీరియస్‌ గా ఫిక్స్‌ అయిన పాల్‌.. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ 100కి పైగా స్థానాల్లో సంచలనం విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు.

ఒక ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఏ పాల్‌ చాలా సీరియస్‌ గా మాట్లాడుతూ.. కామెడీ చేశారు. ఇప్పటికే 70 స్థానాలు ప్రజాశాంతి పార్టీకి ఫిక్స్‌ అయ్యాయని.. మిగిలిన స్థానాల్లోనే తమ ఫోకస్‌ ఉందని చెప్పారు. పనిలో పనిగా లోకేష్‌ పై కూడా కామెంట్స్‌ చేశారు. లోకేష్‌ అసమర్థుడని తనతో ఎవరో ఉన్నారని.. అది నిజమో కాదో తెలుసుకునేందుకు లోకేష్‌ మాట్లాడిన వీడియోలు గమనిస్తే అది నిజమేనని తేలిందని చెప్పుకొచ్చారు. అలాగే గతంలో బాలకృష్ణ అంటే ఎవరో తెలీదని అన్నానని - ఆ తర్వాత అతని గురించి తెలుసుకున్నానని అన్నారు. మొత్తానికి టీవీ చానెల్స్‌ కు టీఆర్‌ పీ రేటింగ్‌ లు అవసరం అయినప్పుడుల్లా ప్రత్యక్షమైపోతున్నారు కేఏపాల్‌.