Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసుపై సీఎం ఫోకస్

By:  Tupaki Desk   |   5 Sept 2020 11:00 PM IST
డ్రగ్స్ కేసుపై సీఎం ఫోకస్
X
కర్ణాటక సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. ప్రముఖ హీరోయిన్ తోపాటు పలువురు సినీ ప్రముఖుల అరెస్ట్ తో అందరిలోనూ వణుకు మొదలైంది. సెలెబ్రెటీల లింకులు కూడా బయటపడుతున్నాయి.

ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం యడ్యూరప్ప దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ డ్రగ్స్ కేసులో కర్ణాటక రాష్ట్రం పరువు పోతోందని.. దాదాపు 85 ఏళ్ల చరిత్ర ఉన్న కన్నడ చిత్ర పరిశ్రమ పరువు కూడా పోతోందని సీఎం యడ్డీ వాపోయారట.. కర్ణాటకను మరో పంజాబ్ లా మారకుండా కాపాడాలని ఆదేశించినట్టు సమాచారం.

కాగా కన్నడ దర్శకుడు లంకేష్, ప్రశాంత్ సంబర్గి డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.చిత్రపరిశ్రమలో పెద్దమొత్తంలో డ్రగ్స్ వాడుతారంటూ సంచలన కామెంట్స్ చేశారు.

మొత్తంగా కర్ణాటకలో బయటపడ్డ ఈ డ్రగ్స్ దందా కన్నడ సర్కార్ కూడా సీరియస్ గా ముందుకెళుతోంది. ఈ విషయంలో బీజేపీ నేతల హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో సీఎం యడ్డీ కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.