Begin typing your search above and press return to search.

సారు కూరగాయలు కొని ఎంతిచ్చారో తెలుసా?

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:36 AM GMT
సారు కూరగాయలు కొని ఎంతిచ్చారో తెలుసా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచలనమే. ఆయన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా గజ్వేల్ లో ఆయన కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ ను చూసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురిని సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆడివమ్మ అనే మహిళా రైతు వద్దకు వెళ్లిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆమె.. సంబరంగా ఉంది సార్.. నీ కడుపు సల్లగుండ.. మంచి పని చేయించావంటూ పొంగిపోయింది. ఆమె మాటలకు చిన్నగా నవ్విన సీఎం కేసీఆర్.. ఆమె దగ్గర కూరగాయలుకొన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి కూడా కూరగాయలు కొన్నారు.
కూరగాయలు తీసుకొని రూ.2వేల నోటు ఆమె చేతిలో పెట్టారు సీఎం కేసీఆర్. డబ్బులొద్దు సార్.. మీరు కొనటమే మా బాగ్యమని ఆమె.. ఆమె కుమారుడు చెప్పారు. బోణీ నాదే కదా తీసుకో అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి చేతిలో డబ్బులు పెట్టటంతో వారు విపరీతమైన ఆనందానికి గురయ్యారు. కూరగాయలకు రూ.2వేలు ఇచ్చిన కేసీఆర్ సారు.. అప్పుడప్పుడు నాలుుగు షాపులకు వెళ్లి కొంటే బాగుండు.