Begin typing your search above and press return to search.

కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్.. వ్యూహాత్మకంగా అడుగులు

By:  Tupaki Desk   |   17 Dec 2022 4:30 PM GMT
కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్.. వ్యూహాత్మకంగా అడుగులు
X
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ పక్కా ప్రణాళికతో జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు అడుగులు వేస్తున్నారు. రైతు సంఘాల నేతలనే ఇందుకు పావుగా వాడుకుంటున్నారు. ఢిల్లీ శివార్ల వద్ద ఏడాదిపాటు ఆందోళనలు చేసిన రైతులకు కేసీఆర్ సంఘీభావం ప్రకటించడమే కాక.. ఈ సందర్భంగా చనిపోయిన 700మందికి పైగా రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరుఫున ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. రైతులు, ఆ సంఘాల నేతలను ఆకట్టుకున్నారు.

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభానికి ప్రతిపక్ష పార్టీలు రాకపోయినా రైతు సంఘాల నేతలు మాత్రం వచ్చారు. కాంగ్రెస్, బీజేపీలతో అంటకాగుతున్న ఉత్తరాది ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ దోస్తీ కొనసాగిస్తున్నప్పటికీ వాటితో కొనసాగడం కష్టమే.

కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ, బీహార్ లో నితీస్ కుమార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ వంటి కొందరు ప్రధాని రేసులో ఉన్నారు. కనుక వారి నుంచి కేసీఆర్ కు తోడ్పాటు రావడం లేదు.

కానీ వారి రాష్ట్రాలలో కేసీఆర్ రాజకీయాలు చేయాలంటే వారి సహకారం తప్పనిసరి లేకుంటే అక్కడ అడుగుపెట్టడం కూడా కష్టమవుతుంది. కనుక వారితో దోస్తీ కొనసాగిస్తే ప్రధాని కావాలనే తన లక్ష్యం సాధన కోసం రైతులను తన సైన్యంగా ఎంచుకున్నట్టు సమాచారం.

అందుకే కేసీఆర్ 'అబ్ కే బార్ కిసాన్ సర్కార్' అనే నినాదంతో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయంలో ఒడిశా, యూపీ, పంజాబ్ , హర్యానా, మహారాష్ట్రలకు చెందిన రైతుల సంఘాల నేతలంతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు.

రైతులకు గిట్టుబాటు ధర, గౌరవం, పెన్షన్ అనే మూడు డిమాండ్లతో దేశవ్యాప్తంగా రైతుల సభలు నిర్వహించాలని ఈ సమావేశంలో వారు నిర్ణయించారు. ముందుగా బీజేపీ పాలిత మహారాష్ట్రలో కరువు పీడత ప్రాంతమైన విదర్భ నుంచి ఈ రైతు సభలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత యూపీ, బీహార్, హర్యానా, ఒడిశా; కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నిర్వహించాలని నిర్ణయించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.