Begin typing your search above and press return to search.

ఆసుప‌త్రిలో క‌విత కుమారుడు

By:  Tupaki Desk   |   18 May 2019 5:25 AM GMT
ఆసుప‌త్రిలో క‌విత కుమారుడు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌మ్ నిజామాబాద్ ఎంపీ క‌విత కుమారుడు అస్వ‌స్థ‌త‌తో ఆసుప‌త్రిలో చేరారు. ప‌ద‌కొండేళ్ల ఆర్య‌కు జ్వ‌రం రావ‌టం.. దాని తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో అత‌డ్ని రెయిన్ బో చిల్డ్ర‌న్ ఆసుప‌త్రిలో చికిత్స కోసం చేర్పించారు.

మ‌న‌మ‌డ్ని ఆసుప‌త్రిలో చేర్పించిన స‌మాచారం అందుకున్న సీఎం కేసీఆర్ ఆసుప‌త్రికి వెళ్లారు. కుమార్తెను.. మ‌న‌మ‌డ్ని ప‌లుక‌రించి.. ఆరోగ్య ప‌రిస్థితి గురించి వాక‌బు చేశారు. ప‌ది నిమిషాల‌కు పైనే ఆసుప‌త్రిలో ఉన్న కేసీఆర్‌.. ఆ త‌ర్వాత వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం బాబు జ్వ‌రం త‌గ్గింద‌ని.. ఎలాంటి ఇబ్బంది లేద‌ని వైద్యులు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ఆసుప‌త్రిలో చేరే స‌మ‌యానికి హైఫీవ‌ర్ ఉంద‌ని.. చికిత్స అనంత‌రం ఆర్య ఆరోగ్యం కుదుట ప‌డిన‌ట్లుగా వైద్యులు చెబుతున్నారు. శుక్ర‌వారం నాటికి కండిష‌న్ నార్మ‌ల్ కు వ‌చ్చినా.. మ‌రో రోజు వెయిట్ చేసిన త‌ర్వాత డిశ్చార్జ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో వైద్యులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు (శ‌నివారం) ఆర్య‌ను ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేయ‌టానికి ఎక్కువ అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా వైద్యులు వెల్ల‌డిస్తున్నారు.