Begin typing your search above and press return to search.

మునుగోడుపై తొలి విజ‌యం సాధించిన కేసీఆర్‌.. !!

By:  Tupaki Desk   |   18 Oct 2022 8:32 AM GMT
మునుగోడుపై తొలి విజ‌యం సాధించిన కేసీఆర్‌.. !!
X
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఈ విష‌యంలో తొలి విజ‌యం సాధించారు. త‌న ప‌ట్టు నిల‌బెట్టుకున్నారు. కొంద‌రు ఇక్క‌డ టీఆర్ ఎస్ అభ్య‌ర్థికి కంట్లో న‌లుసుగా మారారు. ఈ క్ర‌మంలో కారు గుర్తును పోలిన గుర్తుల‌ను వారు ఎంచుకున్నారు. దీనిపై టీఆర్ ఎస్‌.. పెద్ద యుద్ధ‌మే చేసింది. కోర్టుకు కూడా వెళ్లింది. కారు గుర్తును పోలిన పోలింగ్ గుర్తుల‌ను తొల‌గించాల‌ని కోరింది. అయితే.. దీనినిఅత్యవ‌స‌రంగా విచారించాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కోర్టు పేర్కొంది.

అయితే.. ఎట్ట‌కేల‌కు సాయంత్రానికి ఎన్నిక‌ల సంఘం అనుకూల నిర్ణ‌యం తీసుకుంది. కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించవద్దన్న టీఆర్ఎస్ అభ్యర్థనతో ట్రక్కు, ట్రాక్టర్ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించలేదు. అయితే, రోడ్డు రోలర్ కోసం మాత్రం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీపడగా లాటరీ విధానంలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ కొలిశెట్టికి కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు ఉంగరం గుర్తు కేటాయించారు. దీంతో తాము అనుకున్న విధంగా.. ప‌ట్టు బిగించామ‌ని.. కేసీఆర్ స‌హా.. టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌రోవైపు మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచారు. చివరి రోజు మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఉప ఎన్నిక కోసం మొత్తం 130 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీటిలో 47 తిరస్కరణకు గురయ్యారు.

దీంతో 83 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజైన నిన్న 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బరిలో నిలిచిన తుది అభ్యర్థుల సంఖ్య 47కు పరిమితమైంది.

ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లే పట్టే అవకాశం ఉండడంతో ఒక్కో బూత్‌లో మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. అభ్యర్థుల పేర్లు, గుర్తుతో పాటు వారి ఫొటోలను ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.

బరిలో ఉన్న 47 మంది అభ్యర్థుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు మాత్రమే గుర్తింపు పొందిన పార్టీలు కావ‌డం గ‌మ‌నార్హం. మిగతా వారిలో ఇతర పార్టీకు చెందినవారు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా ఉన్నారు. వీరంతా కూడా.. ఓట్ల‌ను చీల్చ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇది పార్టీ అభ్య‌ర్థుల‌కు టెన్ష‌న్‌గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.