Begin typing your search above and press return to search.

రోహిత్ శర్మకు దేశ అత్యున్నత క్రీడాపురస్కారం

By:  Tupaki Desk   |   21 Aug 2020 4:18 PM GMT
రోహిత్ శర్మకు దేశ అత్యున్నత క్రీడాపురస్కారం
X
టీమిండియా వైస్ కెప్టెన్ , క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. కేంద్ర ప్రభుత్వం క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యాడు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం రోహిత్ శర్మకు ఈ ఆవార్డును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మతోపాటు వివిధ క్రీడా విభాగాల్లోని వారికి కూడా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.

క్రికెట్ లో రోహిత్ శర్మకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ ఇవ్వగా.. టేబుల్ టెన్నిస్ లో మణికబాత్రా, రెజ్లింగ్ లో వినేష్ ఫొగట్, హాకీలో రాణి, పారా అథ్లెటిక్స్ లో మరియప్పన్ ను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.