Begin typing your search above and press return to search.

రెండు రూపాయల కోసం చంపేశాడు

By:  Tupaki Desk   |   10 Nov 2019 10:59 AM GMT
రెండు రూపాయల కోసం చంపేశాడు
X
కేవలం రెండు రూపాయలు.. మనిషి ప్రాణాలు తీసేలా చేశాయి. రెండు రూపాయల కోసం మనుషులను చంపే వారు ఉంటారా అని ఆశ్చర్యపోకండి.. ఆ రెండు రూపాయలతో మొదలైన గొడవే ఒకరి హత్యకు దారితీసింది. ఈ దారుణం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సంచలనం సృష్టించింది.

కాకినాడ రూరల్ మండలం వలసపాకలో దారుణం జరిగింది. సువర్ణరాజు అనే వ్యక్తి తన సైకిల్ లో గాలిని నింపుకునేందుకు అప్పలరాజు అనే వ్యక్తికి చెందిన సైకిల్ రిపేర్ షాపుకు వచ్చాడు. సువర్ణరాజు సైకిల్ లో గాలి నింపిన అప్పలరాజు ప్రతిగా రెండు రూపాయలు ఇవ్వాలని కోరాడు. నన్నే డబ్బులు అడుగుతావా అని సువర్ణ రాజు గద్దించాడు. ఇది కాస్తా వాగ్వాదానికి దారితీసింది. గొడవ చిలికి చిలికి పెద్దగా మారింది. కోపంతో ఊగిపోయిన సువర్ణ రాజు అప్పలరాజుపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహంలో అప్పలరాజు అక్కడే ఉన్న కత్తిని తీసి సువర్ణరాజును పొడిచేశాడు.

కత్తితో పొడవగానే సువర్ణరాజు తీవ్రంగా గాయపడి కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే సువర్ణ రాజు మరణించాడు. ప్రస్తుతం అప్పలరాజు పరారీలో ఉన్నాడు. ఇలా కేవలం రెండు రూపాయల కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది.