Begin typing your search above and press return to search.

చేతులెత్తేసిన కిషన్ రెడ్డి

By:  Tupaki Desk   |   25 Jun 2015 1:12 PM GMT
చేతులెత్తేసిన కిషన్ రెడ్డి
X
ఓటు - నోటు కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ కేసుతో తమకు సంబంధమే లేదని, దాని గురించి తాము వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్షన్ 8 అమలు అవసరమే లేదని, నగరం ప్రశాంతంగానే ఉందని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సెక్షన్ 8 అమలు చేస్తే ప్రజల మధ్య విబేధాలు పొడచూపే అవకాశం పెరుగుతుందని, విద్వేషాలు పెంచే చర్యలు ప్రజలకు మంచివి కావని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. టీడీపీ-టీఆర్ఎస్ రెండు పార్టీలు తమ సమస్యలను రాష్ట్ర సమస్యలను చిత్రీకరిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

అయితే, బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో పొత్తు నెరపుతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి హోదాలో జి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. మరి దీనిపై తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.