Begin typing your search above and press return to search.
డ్రగ్స్ టెస్ట్ కి నేను రెడీ .. దమ్ముంటే రాహుల్ గాంధీ వస్తాడా
By: Tupaki Desk | 18 Sept 2021 8:00 PM ISTతెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ని తిడితే బట్టలూడదీసి కొడతామని, అంతేకాదు, రాష్ట్రాన్ని పొగిడితే జాతీయ నాయకున్ని గాడిద అన్న రేవంత్ రెడ్డి, అడ్డ గాడిదనా, నిలువు గాడిదనా అంటూ ఘాటైన వ్యాఖ్యలతో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నిర్మల్ వేదికగా బీజేపీ, గజ్వేల్ వేదికగా కాంగ్రెస్ పార్టీలు శుక్రవారం నాడు బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సభలలో ఆయా పార్టీల నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో నేడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష పార్టీల నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసుకుంటూ, గ్రామాలు తిరుగుతూ ఒకాయన పాదయాత్ర చేస్తుంటే, ఇంకొకాయన మార్కెట్లోకి కొత్తగా వచ్చి హడావుడి చేస్తున్నాడని, మార్కెటింగ్ చేసుకుంటున్నాడని బండి సంజయ్, రేవంత్ రెడ్డి పై సెటైర్లు వేశాడు. సీఎం ఇలాకా గజ్వేల్లో సభ పెట్టామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోందని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలా మారిందని ఎద్దేవా చేశారు. మాణిక్కం ఠాకూర్ రూ. 50 కోట్లకు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని కేటీఆర్ అన్నారు.
ఇక ఎవరు ఎక్కువగా తిడితే వారికే యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయని, నెగటీవ్ వార్తలకు ఎక్కువగా పబ్లిసిటీ వస్తోందని కేంద్ర మంత్రి గడ్కరీ కూడా అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో కొందరు నేతలు ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా తిడుతున్నారని, నోరు ఉందికదా అని తిడితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఎవరెవరి అక్రమ సంపాదన ఏంటో తమకు అన్నీ తెలుసునన్న కేటీఆర్.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పొగిడిన జాతీయ నాయకత్వాన్ని గాడిద అంటావు.. మరి నువ్వు అడ్డ గాడిదవా? నిలువు గాడిదవా? అంటూ రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నిర్మల్ పర్యటనలో మతం రంగుతో మాట్లాడారని విమర్శించారు. 7 ఏళ్ళల్లో బీజేపీ ఏం చేసిందో చెప్పాలి గానీ.. ఎంఐఎంకు తాము భయపడుతున్నామంటూ సొల్లు కబర్లు చెప్పడం ఏంటని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఎన్నో హామీలను కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. శుక్రవారం నాడు నిర్మల్ వెళ్లిన అమిత్ షా.. ఆ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పలేదెందుకు అని ప్రశ్నించారు. అప్పటి పోరాట యోధులకు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పలేదెందుకు అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ చరిత్రలో మొదటిసారి 3 జూట్ మిల్లులు వచ్చాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తాము ప్రభుత్వంలో ఉండి బిజీగా ఉన్నామని, హుజూరాబాద్ ఉప ఎన్నిక అంత పెద్ద విషయమే కాదని అన్నారు. అక్కడ వందశాతం టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, అందులో అనుమానమే లేదని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యత అవసరం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పార్టీలు ఎందుకు పుట్టుకొచ్చాయో ప్రజలకు బాగా తెలుసునని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఒక్క కేసీఆర్ను మాత్రమే ఎందుకు తిడుతున్నారు అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ను పొగిడింది ఆయనే కదా? అని అన్నారు. బీజేపీ విషయంలో ఆయన నోరు ఎందుకు పెకలడం లేదని నిలదీశారు. ఒక వైఎస్ షర్మిల కూడా అదే పంథాలో నడుస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.ఇదే సమయంలో డ్రగ్స్ అంశంపై మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తనను డ్రగ్స్కు అంబాసిడర్ అని కొందరు అంటున్నారని, వాళ్లు అసలు మనిషేనా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘నా రక్త నమూనాలు, లివర్ టెస్ట్ ఇస్తా.. దమ్ముంటే మీ రాహుల్ గాంధీ కూడా వస్తాడా?’’ అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరాడు.
ఈ నేపథ్యంలో నేడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష పార్టీల నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసుకుంటూ, గ్రామాలు తిరుగుతూ ఒకాయన పాదయాత్ర చేస్తుంటే, ఇంకొకాయన మార్కెట్లోకి కొత్తగా వచ్చి హడావుడి చేస్తున్నాడని, మార్కెటింగ్ చేసుకుంటున్నాడని బండి సంజయ్, రేవంత్ రెడ్డి పై సెటైర్లు వేశాడు. సీఎం ఇలాకా గజ్వేల్లో సభ పెట్టామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోందని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలా మారిందని ఎద్దేవా చేశారు. మాణిక్కం ఠాకూర్ రూ. 50 కోట్లకు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని కేటీఆర్ అన్నారు.
ఇక ఎవరు ఎక్కువగా తిడితే వారికే యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయని, నెగటీవ్ వార్తలకు ఎక్కువగా పబ్లిసిటీ వస్తోందని కేంద్ర మంత్రి గడ్కరీ కూడా అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో కొందరు నేతలు ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా తిడుతున్నారని, నోరు ఉందికదా అని తిడితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఎవరెవరి అక్రమ సంపాదన ఏంటో తమకు అన్నీ తెలుసునన్న కేటీఆర్.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పొగిడిన జాతీయ నాయకత్వాన్ని గాడిద అంటావు.. మరి నువ్వు అడ్డ గాడిదవా? నిలువు గాడిదవా? అంటూ రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నిర్మల్ పర్యటనలో మతం రంగుతో మాట్లాడారని విమర్శించారు. 7 ఏళ్ళల్లో బీజేపీ ఏం చేసిందో చెప్పాలి గానీ.. ఎంఐఎంకు తాము భయపడుతున్నామంటూ సొల్లు కబర్లు చెప్పడం ఏంటని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఎన్నో హామీలను కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. శుక్రవారం నాడు నిర్మల్ వెళ్లిన అమిత్ షా.. ఆ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పలేదెందుకు అని ప్రశ్నించారు. అప్పటి పోరాట యోధులకు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పలేదెందుకు అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ చరిత్రలో మొదటిసారి 3 జూట్ మిల్లులు వచ్చాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తాము ప్రభుత్వంలో ఉండి బిజీగా ఉన్నామని, హుజూరాబాద్ ఉప ఎన్నిక అంత పెద్ద విషయమే కాదని అన్నారు. అక్కడ వందశాతం టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, అందులో అనుమానమే లేదని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యత అవసరం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పార్టీలు ఎందుకు పుట్టుకొచ్చాయో ప్రజలకు బాగా తెలుసునని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఒక్క కేసీఆర్ను మాత్రమే ఎందుకు తిడుతున్నారు అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ను పొగిడింది ఆయనే కదా? అని అన్నారు. బీజేపీ విషయంలో ఆయన నోరు ఎందుకు పెకలడం లేదని నిలదీశారు. ఒక వైఎస్ షర్మిల కూడా అదే పంథాలో నడుస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.ఇదే సమయంలో డ్రగ్స్ అంశంపై మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తనను డ్రగ్స్కు అంబాసిడర్ అని కొందరు అంటున్నారని, వాళ్లు అసలు మనిషేనా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘నా రక్త నమూనాలు, లివర్ టెస్ట్ ఇస్తా.. దమ్ముంటే మీ రాహుల్ గాంధీ కూడా వస్తాడా?’’ అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరాడు.