Begin typing your search above and press return to search.

పంచాయతీ కార్యాలయానికి తాళం... ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమన్న సర్పంచ్‌ భర్త !

By:  Tupaki Desk   |   21 Jun 2021 2:30 PM GMT
పంచాయతీ కార్యాలయానికి తాళం... ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమన్న సర్పంచ్‌ భర్త !
X
ఓ మహిళా సర్పంచ్‌ భర్త పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి దిక్కున్న చోట చెప్పుకో అని హుకుం జారీ చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో వెలుగులోకి వచ్చింది. ఆదివారం వ్యాక్సిన్ కూపన్లు వితరణ విషయంలో ములికిపల్లి గ్రామ సర్పంచ్ భర్త రాజు చెలరేగి పోయినట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. సర్పంచ్ భర్త గుబ్బల రాజు మహిళా కార్యదర్శిని బయటకు పంపి, పంచాయతీకి తాళం వేసి నీకు దిక్కున్న చోట చెప్పుకోమని దుర్భాషలాడినట్టు తెలుస్తోంది.

ఇక ఈ వ్యవహారం పై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం కరోనా వైరస్ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ లో భాగంగా ములికిల్లి పంచాయతీ నుండి వ్యాక్సినేషన్‌ కూపన్లను ప్రజలకు పంపిణీ చేసేందుకు పంచాయతీ కార్యదర్శి రజని అన్ని సిద్ధం చేశారు. కరోనా వ్యాక్సిన్ కి సంబంధించిన కూపన్ల పంపిణీ పంచాయతీ దగ్గర కాదు. మా ఇంటి దగ్గర నుండి చేయాలంటూ సర్పంచ్‌ భర్త రాజు హుకుం జారీ చేశాడు. సర్పంచ్‌ ఇంటి వద్ద నుండి కూపన్లు పంపిణీ కుదరదని కార్యదర్శి రజిని తేల్చి చెప్పడంతో సర్పంచ్‌ భర్త రాజుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కార్యదర్శి రజనిపై నానా దుర్భాషలాడి పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నీకు దిక్కున్న చోట చెప్పుకో.. అంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన సంచలనం రేపింది.