Begin typing your search above and press return to search.

అంతా బాబు బొక్కలు తెలిసినోళ్లే..లెక్క తేల్చేలానే ఉన్నారు

By:  Tupaki Desk   |   16 Feb 2018 4:52 PM GMT
అంతా బాబు బొక్కలు తెలిసినోళ్లే..లెక్క తేల్చేలానే ఉన్నారు
X
గత ఎన్నికల్లో చంద్రబాబుకు తోడి పెళ్లికొడుకుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి నిన్నమొన్నటి వరకు అదే పాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెల్లమెల్లగా రూటు మారుస్తున్నారు. చంద్రబాబు సంగతులు తెలిసినవారిని తన టీంలో చేర్చుకుంటున్నారు. వారితోనే చంద్రబాబు లెక్క తేల్చి ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా నిధులపై వేసిన నిజనిర్ధారణ సంఘం వారం రోజుల్లో అన్ని వివరాలు బయటపెడతామని చెప్పడంతో పవన్ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు... ఈ నిజాలు తవ్వే టీంలో ఆ రంగంలో అనుభవం ఉన్న వారితో పాటు చంద్ర బాబు గుట్టుమట్లు తెలిసినవారు - ఆయన బాగా వాడుకుని వదిలేసిన వారిని ఇప్పుడు పవన్ చేరదీస్తున్నారు.

ముఖ్యంగా నిజనిర్ధారణ సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉండవల్లి - జయప్రకాశ్ నారాయణ్‌ లలో ఉండవల్లి మొదటి నుంచి చంద్రబాబు వ్యతిరేకి కాగా జేపీ మాత్రం చంద్రబాబుతో కలిసి పనిచేసిన వారు. అధికారిగా చంద్రబాబు వద్ద పనిచేయడమే కాకుండా ఆ తరువాత రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబుతో కలిసి పనిచేశారు. అయితే... ఆ తరువాత ఆయన పార్టీ ముక్కలు కావడంతో పాటు చంద్రబాబు కూడా ఆయన్ను వదిలేశారు. దీంతో జేపీకి ఇప్పుడు పవన్ మళ్లీ ప్లాట్ ఫాం ఇస్తున్నట్లే.

ఇక నిజ నిర్ధారణ సంఘంలో ఉన్న ఐవైఆర్ కూడా ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత ప్రీతి పాత్రుడే. ఆ తరువాత చంద్రబాబుతో ఆయనకూ చెడింది. ఆయన కూడా రాజకీయంగా అవకాశాల కోసం చూస్తున్నారన్న ప్రచారం ఉంది. చంద్రబాబు తీరు ఐవైఆర్‌ కు కూడా బాగానే తెలుసు.

దీంతో చంద్రబాబు అంటే రగులుతున్న బ్యాచ్‌ నంతా పవన్ చేరదీసినట్లయంది. తాజాగా జేఎఫ్‌ సీ ఏర్పాటుపై పలువురు నేతలు - రాజకీయ - ఆర్థిక వేత్తలు హైదరాబాద్‌ లో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం తాము తీసుకున్న పలు నిర్ణయాలపై జయప్రకాశ్ నారాయణ ప్రకటన చేశారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని వివ‌రాలు అడిగామని - అవి రావాల్సి ఉందని జేపీ చెప్పారు. అధికారిక కేటాయింపులు - హామీల అమ‌లుపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టన చేయాల్సి ఉందని అన్నారు.