Begin typing your search above and press return to search.

ప్రేమించి పెళ్లాడిన భార్యను డంబెల్స్ తో బాది హత్య: హైదరాబాద్ లో మరో ఘోరం..

By:  Tupaki Desk   |   7 Jun 2022 6:31 AM GMT
ప్రేమించి పెళ్లాడిన భార్యను డంబెల్స్ తో బాది హత్య: హైదరాబాద్ లో మరో ఘోరం..
X
నేరాలు.. ఘోరాలతో హైదరాబాద్ అట్టుడుకుతోంది. ఇటీవల రాజధాని నడిబొడ్డున జరిగిన బాలికపై అత్యాచార ఘటన మరువకముందే మరో ఘోరం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లాడిని తన భార్యను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆపై ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ముల్లో పెట్టి ఇంటికి తాళం వేశాడు. ఆ తరుతవాత దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది.

దీంతో అసలు విషయం బయటపడింది. అసలు ఘోరమేంటంటే ఆ వ్యక్తి హత్య చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఓ భార్యను నరికి చంపిన ఆయన రిమాండ్లో ఉన్నాడు. బెయిల్ పై బయటకు వచ్చి మరో ఘోరానికి పాల్పడ్డాడు. క్రూరమైన మైండ్ సెట్ కలిగిన ఇతన్ని బాధితురాలు ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుంది..? ఆ తరువాత హత్యకు గురి కావడానికి దారితీసిన పరిస్థితులేంటి..?

నగరంలోని హఫీజ్ పేటకు చెందిన సరోజ అనే అమ్మాయి ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వీరి మనసులు కలవడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొత్త ఆశలతో సరోజ తన భర్తతో సుఖంగా ఉండేందుకు అన్ని ప్లాన్స్ వేసుకొని సంసారం ప్రారంభించింది. కొద్ది రోజులు అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలు పెదవయ్యాయి. అయితే ఈ గొడవలు రావడానికి పెద్ద కారణమే ఉంది.

అనిల్ కుమార్ కు అప్పటికే పెళ్లయింది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్న సరోజ సహించుకోలేకపోయింది. తన భర్త ఎంతో పవిత్రంగా ఉండాలనుకున్న ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. కానీ సరోజ తనకు రెండో భర్త వచ్చాడన్న విషయం తెలుసుకొని కుమిలిపోయింది. ఆ తరువాత అనిల్ కుమార్ ను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య రోజూ గొడవలు జరిగాయి. ఓరోజు ఈ విషయం పెద్దది కావడంతో అనిల్ కుమార్ తన ఇంట్లో ఉన్న డంబెల్స్ తో సరోజ తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అక్కడితో అనిల్ ఆగకుండా ఆమెను ముక్కలు ముక్కులుగా కోశాడు. ఓ డ్రమ్ములో కుక్కిపెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లాడు.

సరోజ హత్య జరిగే ఒకరోజు ముందు తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆందోళన చెందిన వారు సరోజను చూసేందుకు వచ్చారు. కానీ ఇంటికి తాళం వేసి ఉండడంతో పాటు అక్కడే దుర్వాసన రావడంతో స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డ్రమ్ములో శరీరం ముక్కలై కనిపించింది. దీంతో పోలీసులు ఆరా తీశారు. అనిల్ గురించి తెలుసుకున్నారు.

అనిల్ ఇప్పటికే మొదటి భార్యను హత్య చేశాడు. ఆ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయన బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో సరోజకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు.. ఆ తరువాత హత్య చేశాడు. జనజీవనగానికి అనువైన ప్లేస్ హైదరాబాద్ అని కితాబులు వస్తున్న తరుణంలో నగరంలో ఇలంటి వరుస సంఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.