Begin typing your search above and press return to search.

పెళ్లాం స్పైసీగా వండలేదని..బిల్డింగ్ పై నుంచి దూకేయబోయాడు

By:  Tupaki Desk   |   17 May 2020 7:25 AM GMT
పెళ్లాం స్పైసీగా వండలేదని..బిల్డింగ్ పై నుంచి దూకేయబోయాడు
X
లాక్ డౌన్ వేళ సిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఇంట్లో తాను కోరిన రీతిలో రుచిగా వండలేదన్న కారణంతో ఉడికిపోయిన భర్త ఒకరు చేసిన పని విస్తుపోయేలా చేస్తోంది. బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉండే ఒక వ్యక్తి.. భార్య చేసిన వంట స్పైసీగా లేకపోవటాన్ని తట్టుకోలేకపోయాడు.

వారాలకు వారాల పాటు సాగిన లాక్ డౌన్ తో రెస్టారెంట్లు.. హోటళ్లు.. బంద్ కావటంతో బయటకు వెళ్లి కోరినట్లుగా తినలేని పరిస్థితి. ఇంట్లోనేమో.. కోరినట్లుగా మసాలాలతో.. కారంగా చేయని ఫుడ్ కు విసిగిపోయాడు. సూసైడ్ చేసుకోబోయాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అహ్మదాబాద్ లోని చాంద్ ఖేడాలో హర్మేష్ సుఖాడియా అనే పెద్ద మనిషి ఉంటాడు. అతడి భార్య చేస్తున్న ఫుడ్.. ఆయన కోరుకున్నట్లు స్పైగా ఉండటం లేదు. అప్పటికి పలుమార్లు చెప్పినా.. ఇంటి పరిస్థితుల్లో మార్పు రాలేదట. దీంతో.. సహనం కోల్పోయిన అతగాడు.. ఆవేశంతో బాల్కనీ మీద నుంచి కిందకు దూకబోయాడు. ఇంత చిన్న విషయానికే అంత పని చేస్తారని ఊహించని ఇంటి వాళ్లు షాక్ తో.. అతడ్ని రక్షించే పని చేశారు. ఈ గొడవంతా చూసి.. చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చారు.

అప్పటికే కిందకు జారిపోతున్న అతడ్ని.. శ్రమపడి.. అందరూ కలిసి పైకి లాగటంతో ప్రాణాప్రాయం తప్పింది. ఈ ఉదంతాన్ని అటుగా వెళుతున్న ఒక వ్యక్తి గుర్తించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో.. ఈ ఉదంతం ప్రపంచానికి తెలిసిందే. ఆత్మహత్య చేసుకోబోయిన సదరు వ్యక్తి వివరాల్ని సేకరించిన పోలీసులు.. అతడి మీద కేసు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. భార్య కోరుకున్నట్లుగా వండకపోతే.. చచ్చిపోవాల్సిన అవసరం ఏమిటి? ఇరుగుపొరున ఉన్న మాలాంటి సన్నిహితుల్ని అడిగితే సరిపోయేది కదా అంటూ అపార్ట్ మెంటు వాసులు జాలిని ప్రదర్శిస్తున్నారట. అదే పనిగా ఇంట్లో ఉంటూ.. ఎలాంటి వ్యాపకం లేని వేళ.. ఇలాంటి విపరీతాలకు కొందరు పాల్పడుతున్న వైనం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది