Begin typing your search above and press return to search.

మంచిర్యాలలో ఘోరం: ఇంట్లో నిద్ర పోతున్న ఆరుగురు కాలి బుడిధ

By:  Tupaki Desk   |   17 Dec 2022 7:30 AM GMT
మంచిర్యాలలో ఘోరం: ఇంట్లో నిద్ర పోతున్న ఆరుగురు కాలి బుడిధ
X
వేసవిలో అగ్నిప్రమాదాలు విన్నాం. వణికించే చలివేళ.. నిప్పు ఎలా రాజుకుందో కానీ.. మంచిర్యాలలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో ఏకంగా ఆరుగురు కాలి బూడినైన వైనం షాకింగ్ గా మారింది. పిల్లలతో పడుకున్న కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయిన వైనంపై చుట్టుపక్కల ప్రాంతాల వారు ఒక పట్టాన జీర్ణించుకోలేపోతున్నారు. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించినప్పటికీ మంటల్ని మాత్రం అదుపులోకి తీసుకురాలేకపోయినట్లు చెబుతున్నారు.

మంచిర్యాలలోని మందమర్రి మండలంలోని వెంకటాపూర్ లో శుక్రవారం అర్థరాత్రి వేళ ఈ ఘోరం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్ర పోతున్న వేళ.. అకస్మాత్తుగా మంటలు చెలరేగటం.. వాటిని అదుపులోకి తీసుకురావటంలో సాధ్యం కాకపోవటంతో ఇంట్లో ఉన్న ఆరుగురు కాలి బూడిదయ్యారు.

మరణించిన వారిలో ఇంటి యజమాని యాభై ఏళ్ల శివయ్య.. ఆయన సతీమణి పద్మ (45), ఆమె అక్క కుమార్తె మౌనిక.. వారి ఇద్దరు కుమార్తెలు స్వీటీ (4), హిమబిందు (2), సింగరేణి ఉద్యోగి శాంతయ్య ఉన్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? ఇంకేదైనా కారణం ఉందా? అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షార్ట్ సర్య్కూట్ కారణంగా ఇంత పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకునే అవకాశం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. అగ్నిప్రమాదం జరిగిన శివయ్యకు ఎవరైనా వ్యక్తిగత ద్వేషంలో ఇదంతా చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి కారణం.. శివయ్య సతీమణి పద్మకు వేరే వారితో వివాహేతర సంబంధం ఉందంటున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం గజిబిజిగా ఉందని చెప్పాలి. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? దాని వెనుక కారణాల్ని మరింత లోతుగా అధ్యయనం చేసి చెప్పాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.