Begin typing your search above and press return to search.

ఖరారు: 24న గులాబీ గూటికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి

By:  Tupaki Desk   |   22 April 2015 3:14 PM IST
ఖరారు: 24న గులాబీ గూటికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి
X
దాదాపు రెండుమూడు రోజులుగా సాగుతున్న రాజకీయ చర్చలు నేడు ఒక కొలిక్కి వచ్చాయి. ఇబ్రహీంపట్నం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గులాబీ గూటికి చేరుతారా లేదా అనే సందేహానికి తెరపడి 24న చేరనున్నారు అని ఖరారయింది.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో మంచిరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మంచిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 24న టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిపారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నానన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.

చంద్రబాబు పాలమూరు పర్యటన రోజే మంచిరెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని భావించినప్పటికీ... ప్లీనరీలో చేర్చుకుంటే మరింత బలం చేకూరినట్లు అవుతుందని 24వ తేదీని టీఆర్ఎస్్ వర్గాలు ఓకే చేసినట్లు సమాచారం.