Begin typing your search above and press return to search.
వైరల్ న్యూస్ : కరోనా భాదితులకు చికిత్స అందించిన డాక్టర్ ఆత్మహత్య!
By: Tupaki Desk | 29 April 2020 7:00 AM ISTఅమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ పై కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. మహమ్మారి కారణంగా ఇప్పటికే అక్కడ 16 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతదేహాలను పూడ్చేందుకు కూడా సరిపడా స్థలం లేకపోవడంతో బ్రాంక్స్ వంటి ప్రాంతాల్లో శవపేటికలు ఒకదానిపై ఒకటి పేర్చి ఖననం చేసిన దృశ్యాలు అందరిని కలచి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'తన పనిని తాను చేయాలని భావించింది. కానీ అదే ఆమె ప్రాణాలు బలిగొంది' అంటూ ఓ మహిళా వైద్యురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు నిజమైన హీరో కాబట్టి.. ఆమె ప్రశంసలు అందుకునేందుకు అర్హురాలని ఉద్వేగానికి లోనయ్యారు. అసలేమైంది అంటే ...
న్యూయార్క్ లో లక్షలాది మంది ప్రాణాంతక వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తున్న డాక్టర్ లార్నా ఎం. బ్రీన్ చలించిపోయారు. ఆస్పత్రిలో లేదా ఇంట్లో ఉన్నా ఎల్లప్పుడు రోగుల బాగోగుల గురించి ఆలోచించే ఆమె.. తాను చికిత్స అందించిన కరోనా పేషెంట్లు చనిపోవడం తట్టుకోలేక ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి డాక్టర్ ఫిలిఫ్ సి. బ్రీన్ వెల్లడించారు. మన్ హట్టన్ న్యూయార్క్ అలెన్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగం మెడికల్ డైరెక్టర్ గా పని చేస్తున్న లార్నా చని పోయారని తెలిపారు
తనకు ఎలాంటి మానసిక అనారోగ్యం లేదని.. ఈ విపరీత చర్యకు పాల్పడే ముందు తనతో మాట్లాడిందని... అంబులెన్సులో ఎక్కించడానికి ముందే ఎంతో మంది పేషెంట్లు మృతి చెందడం తనను వేదనకు గురిచేస్తుందని చెప్పిందని ఫిలిప్ తెలిపారు. పేషెంట్లకు సేవలు అందిస్తున్న సమయంలో తన కూతురికి కూడా కరోనా సోకిందని.. అయినప్పటికీ ఎంతో ధైర్యంగా మహమ్మారితో పోరాడి తిరిగి విధుల్లో చేరిందని గుర్తుచేసుకున్నారు. ఇక ఆస్పత్రి వర్గాలు లార్నా మృతికి గల కారణాలు తమకు అంతుపట్టడం లేదని న్యూయార్క్ టైమ్స్కి తెలిపారు. లార్నా ఎంతో ప్రతిభ గలవారని.. తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించాయి.
న్యూయార్క్ లో లక్షలాది మంది ప్రాణాంతక వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తున్న డాక్టర్ లార్నా ఎం. బ్రీన్ చలించిపోయారు. ఆస్పత్రిలో లేదా ఇంట్లో ఉన్నా ఎల్లప్పుడు రోగుల బాగోగుల గురించి ఆలోచించే ఆమె.. తాను చికిత్స అందించిన కరోనా పేషెంట్లు చనిపోవడం తట్టుకోలేక ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి డాక్టర్ ఫిలిఫ్ సి. బ్రీన్ వెల్లడించారు. మన్ హట్టన్ న్యూయార్క్ అలెన్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగం మెడికల్ డైరెక్టర్ గా పని చేస్తున్న లార్నా చని పోయారని తెలిపారు
తనకు ఎలాంటి మానసిక అనారోగ్యం లేదని.. ఈ విపరీత చర్యకు పాల్పడే ముందు తనతో మాట్లాడిందని... అంబులెన్సులో ఎక్కించడానికి ముందే ఎంతో మంది పేషెంట్లు మృతి చెందడం తనను వేదనకు గురిచేస్తుందని చెప్పిందని ఫిలిప్ తెలిపారు. పేషెంట్లకు సేవలు అందిస్తున్న సమయంలో తన కూతురికి కూడా కరోనా సోకిందని.. అయినప్పటికీ ఎంతో ధైర్యంగా మహమ్మారితో పోరాడి తిరిగి విధుల్లో చేరిందని గుర్తుచేసుకున్నారు. ఇక ఆస్పత్రి వర్గాలు లార్నా మృతికి గల కారణాలు తమకు అంతుపట్టడం లేదని న్యూయార్క్ టైమ్స్కి తెలిపారు. లార్నా ఎంతో ప్రతిభ గలవారని.. తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించాయి.