Begin typing your search above and press return to search.

రసాయన పరిశ్రమలో భారీ పేలుడు నలుగురు మృతి !

By:  Tupaki Desk   |   20 March 2021 8:00 AM GMT
రసాయన పరిశ్రమలో భారీ పేలుడు నలుగురు మృతి !
X
మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని ఓ రసాయన కర్మాగారంలో పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో లోపల 40 నుంచి 50 మంది ఫ్యాక్టరీలో చిక్కుకున్నట్లు సమాచారం. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.