Begin typing your search above and press return to search.

అడవి పందులను చంపి - తినండి..! టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   13 Sept 2020 8:30 PM IST
అడవి పందులను చంపి - తినండి..! టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే!
X
గ్రామాల్లో పండే పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను చంపడంతో పాటు తినే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్‌ చేశారు. అడవి పందులు పంట పొలాలను ఎంతగానో నాశనం చేస్తున్నాయని వాటిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్ ‌గఢ్ - ఉత్తరాఖండ్ - బిహార్‌ తదితర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలను సాగు చేస్తున్న రైతులు.. అడవి పందుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని యాదగిరి రెడ్డి తెలిపారు.

జనగామ - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనాను జయించిన విషయం తెలిసిందే. తెలంగాణ లో కరోనా బారిన పడ్డ తొలి ఎమ్మెల్యే ఈయనే కావడం గమనార్హం. గత జూన్ 12 న ఈయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్ ‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అంతకు ముందే ఆయన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో, ఇతర వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్న వారంతా అప్పుడు క్వారంటైన్‌ లోకి వెళ్లిపోయారు.