Begin typing your search above and press return to search.

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్సీ !

By:  Tupaki Desk   |   29 Jun 2020 2:00 PM GMT
సైబర్  నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్సీ !
X
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో సామాన్య ప్రజలే కాదు, ప్రజాప్రతినిధులు కూడా మోసపోతున్నారు. కేంద్ర పథకాల పేరుతో ఎమ్మెల్సీ ఇక్బాల్ కు, ఆయన సన్నిహితులకు సైబర్ క్రిమినల్స్ టోకరా వేశారు. రెండ్రోజుల క్రితం సబ్సిడీ రుణం పేరుతో ఎమ్మెల్సీ ఇక్బాల్ అనుచరుల నుంచి రూ.10 లక్షలు దోచేశారు.

ఆ తరువాత, ఎమ్మెల్సీ ఇక్బాల్ కు దీనిపై అనుమానం రావడంతో సీఎంవో, పరిశ్రమ శాఖ అధికారులను ఆరా తీశారు. అయితే, అలాంటి పథకాలేవీ లేవని అధికారుల సమాచారం ఇవ్వడంతో ఇక్బాల్‌ ఖంగుతిన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు తూర్పుగోదావరి జిల్లా క్వారంటైన్ కేంద్రంలో ఉన్నట్టు గుర్తించారు. నిందితులు బాలాజీ నాయుడు, వెంకటరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ నాయుడు గ్యాంగ్ పై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్టు గుర్తించారు.