Begin typing your search above and press return to search.

20 ఏళ్ల తర్వాత తెరుచుకోబోతున్న 'కేజీఎఫ్' తలుపులు..!

By:  Tupaki Desk   |   16 Dec 2022 5:17 AM GMT
20 ఏళ్ల తర్వాత తెరుచుకోబోతున్న కేజీఎఫ్ తలుపులు..!
X
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) పేరు చెబితే కన్నడ ప్యాన్ ఇండియా మూవీ 'కేజీఎఫ్' గుర్తుకు రాకమానదు. కర్ణాటకలోని కేజీఎఫ్ ప్రాంతంలో బంగారం నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నంలో జరిగిన సంఘటనలను దర్శకుడు ప్రశాంత్ నీల్ వర్శ సినిమాగా తెరకెక్కించాడు. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ నటించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

'కేజీఎఫ్'కు సీక్వెల్ వచ్చిన 'కేజీఎఫ్-2' సైతం ఈ ఏడాది ఏప్రిల్ 14 ప్రేక్షకులు ముందుకొచ్చింది. కేజీఎఫ్-2 మూవీ కేజీఎఫ్ మొదటి పార్ట్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇక ఈ మూవీలో చూపించింది అంతా నిజం కాకపోయినప్పటికీ కోలార్ గోల్డ్ మైన్స్ గురించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది.

అయితే కోలార్ గోల్డ్ మైన్స్ లో బంగారం నిక్షేపాలను వెలికితీసే ప్రక్రియ 20 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ కోలార్ గోల్డ్ మైన్స్ పై ఆసక్తి చూపిస్తుంది. ఇందులో భాగంగానే కేజీఎఫ్ లో నిల్వ ఉన్న 50 మిలియన్ల శుద్ది చేసిన ఖనిజం నుంచి బంగారం వెలికి తీసేందుకు బిడ్లను ఆహ్వానించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం.

కేజీఎఫ్ లో 2.1 బిలియన్ డాలర్ల విలువైన బంగారం నిక్షేపాలు ఉన్నాయని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు గతంలో శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారం వెలికి తీయాలని యోచిస్తోంది. బంగారాన్ని వెలికి తీసేందుకు ఉన్న ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. బంగారంతో పాటు పల్లాడియంను కూడా వెలికి తీయాలని కేంద్రం భావిస్తోంది.

శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారాన్ని వెలికి తీసే కంపెనీలను రాబోయే నాలుగు నెలల్లో బిడ్లకు ఆహ్వానించాలని కేంద్రం సమాలోచనలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. బంగారాన్ని వెలికి తీసే సమర్థత విదేశాల్లోనే ఎక్కువగా ఉందని దీంతో ఆ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకొని లేదా కన్సార్షియం ఏర్పాటు చేసుకొని బంగారాన్ని వెలికి తీసేందుకు బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతంలో కేజీఎఫ్ నుంచి మట్టిని సేకరించిన తర్వాత గుట్టలుగా పోయారు. దీంతో కేజీఎఫ్ చుట్టురా 13 గుట్టలు పేరుకుపోయాయి. వీటి నుంచి బంగారం వెలికి తీసేందుకు కేంద్రం టెండర్లు ఆహ్వానించబోతుంది. 50 మిలియన్ల మట్టిని ఇప్పటికే సంబంధిత అధికారులు పరిశీలించారు.ఇక్కడి మట్టి 25 టన్నుల బంగారం నిపుణులు అంచనా వేసి కేంద్రానికి నివేదించారు.

ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని చైనా తర్వాత భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకుంటోంది. భారత్ లో బంగారం డిమాండ్ ను తగ్గించడానికి కేంద్రం ఇటీవల సుకాన్ని సైతం భారీగా పెంచింది. ఈ క్రమంలో కేజీఎఫ్ గనులపై సైతం కేంద్రం దృష్టి సారించిందని తెలుస్తోంది. ఏది ఏమైనా దాదాపు 20 ఏళ్ల తర్వాత కేజీఎఫ్ తలుపులు తెరుచుకోనుండటం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.