Begin typing your search above and press return to search.

కలకలం.. కేసీఆర్ పై మావోయిస్టుల పోస్టర్లు

By:  Tupaki Desk   |   4 Dec 2015 2:33 PM IST
కలకలం.. కేసీఆర్ పై మావోయిస్టుల పోస్టర్లు
X
నివురుగప్పిన నిప్పులా ఉన్న మావోయిస్టులు మెల్లమెల్లగా రాజుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా తాజాగా పోస్టర్లు వేయడం కలకలం రేపింది. ఒక్క కేసీఆర్ పైనే కాకుండా ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగానూ పోస్టర్లు వెలిశాయి.

కేసీఆర్, కవితలు బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తున్నారంటూ మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేటలో తాజాగా కేసీఆర్, కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ప్రజల ఆశలను కేసీఆర్ అడియాశలు చేశారని... ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించలేదని వారు ఆరోపించారు.

కాగా ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో మావోయిస్టుల సంచారం ఎక్కువైందని తెలుస్తోంది. బచ్చన్నపేట ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోట. నల్గగొండ, వరంగల్ సరిహద్దుల్లో ఆలేరుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం మావోయిస్టుల ఖిల్లా. తాజాగా ఇక్కడ పార్టీ మళ్లీ బలపడుతున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తున్నారంటూ పోస్టర్లు వేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నిజామాబాద్ ఎంపీ కవితకు భద్రత పెంచనున్నట్లు సమాచారం.