Begin typing your search above and press return to search.

బెంగళూరులో ఐదుగురికి ఒమిక్రాన్.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   3 Dec 2021 3:54 AM GMT
బెంగళూరులో ఐదుగురికి ఒమిక్రాన్.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన
X
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ మహమ్మారి భారత్ కు వచ్చేసింది. తాజాగా భారత్ లోని బెంగళూరులో ఈ వేరియంట్ కేసులు నమోదు కావడం దేశంలో ఆందోళనకు కారణమవుతోంది. కర్ణాటక సహా దేశం మొత్తం ఉలిక్కిపడింది.

బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు కేంద్రం ధ్రువీకరించారు. వీరిలో ఒకరు విదేశీయుడు కాగా.. మరొకరు కర్ణాటకకు చెందిన డాక్టర్ కు కరోనా సోకింది. ఈ వైద్యుడితో కాంటాక్ట్ అయిన మరో ఐదుగురికి కూడా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే.సుధాకర్ వెల్లడించారు.

అయితే ఒమిక్రాన్ సోకిన వైద్యుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని కర్ణాటక ఆరోగ్యమంత్రి చెప్పడం గమనార్హం. ఆయనతో కాంటాక్ట్ అయిన వారిలో ఐదుగురికి పాజిటివ్ అని తేలిందని మంత్రి చెప్పారు. ఈ ఐదుగురూ డాక్టర్లేనని సమాచారం. వీరిలో ఇద్దరు ప్రైమరీ కాంటాక్టులు కాగా.. ముగ్గురు సెకండరీ కాంటాక్టులని.. వారికి నవంబర్ 22, 25 తేదీల్లో వీరికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలిందన్నారు.

ఈ ఆరుగురిని బెంగళూరులోని ప్రభుత్వ హాస్పిటల్ లో ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరందరికి ఆరోగ్యపరమైన సమస్యలు లేవని.. లక్షణాలు మైల్డ్ గానే ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఒమిక్రాన్ గా తేలిన డాక్టర్ కు ఆయాసం, జ్వరం ఉండడంతో కరోనా టెస్టు చేయగా పాజిటివ్వచ్చిందని.. దీంతో ఆయన్ను ఐసోలేషన్ లో ఉంచామని కర్నాటక సర్కార్ తెలిపింది. ఆయనలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉందన్నారు. టెస్ట్ చేయగా ఒమిక్రాన్ అని తేలిందన్నారు.ఇక ఆఫ్రికాకు చెందిన వ్యక్తి దుబాయ్ మీదుగా బెంగళూరుకు వచ్చాడని..ఆయనకు 24 మంది ప్రైమరీ కాంటాక్టులు, 240 మంది సెకండరీ కాంటాక్టులు ఉన్నారని.. వారందరికీ టెస్టులు చేయగా నెగెటివ్ వచ్చినట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66ఏళ్ల వ్యక్తికి నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అతడిని సెల్ఫ్ ఐసోలేషన్ లోకి పంపించారు.